రామాయణము
అయోధ్యకాండ -నూఱవసర్గ
తన పాదములకు నమస్కారము చేసివున్న ,బక్కచిక్కివున్న భరతుని చూసి గుర్తించిన శ్రీరాముడు తమ్ముని ప్రేమతో ఆలింగనము చేసుకుని శిరము మూర్కొనెను (ముద్దాడెను ). పిమ్మట రాముడు "నాయనా !భరతా !కుశలమేనా . మీ మేనమామగారింటికి వెళ్లిన పిదప పెక్కుకాలము తర్వాత నిన్ను చూస్తున్నాను . ఇలా చిక్కిపోయినవేమి ?తండ్రిగారు కానవచ్చుటలేదు వారు ఏరి ?రాలేదా !వారు కుశలమేనా ?తల్లులు మువ్వురు కుశలమేనా ?కౌశల్యాదేవి బాధ నుండి ఉపశమనము పొందినదా ?సుమిత్రాదేవి కుశలమేనా ?కైకేయి దేవి సంతోషమేనా ?మన కులగురువైనా వశిష్ఠుడు కుశలమేనా ?ఆయన తెలుపు మార్గములోనే నడుచుచున్నావు కదా !మంత్రులు కుశలమేనా ?నీకు అనుకూలురైన మంత్రులనే నియమించుకున్నావు కదా !రాజ్య భారము సక్రమముగా చేయుచున్నావుకదా ,రాజ్యము వదిలి ఇలా అరణ్యము నకు వచ్చితివేమి ?"అని పలుకుతూ పలు రకముల ధర్మ భోదలు చేసెను .
రామాయణము అయోధ్యకాండ నూరవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment