Tuesday, 7 February 2017

రామాయణo అయోధ్యకాండ -తొంబది మూడవసర్గ

                                     రామాయణo 

                                   అయోధ్యకాండ -తొంబది మూడవసర్గ 

అట్లు వనములో ప్రయాణించుచున్న మహా సేనను చూసి భీతిల్లిన మదపుటేనుగులు మున్నగు వన్య మృగములు తమ గుంపులతో కూడి ,పరుగులు తీసినవి . భరతుడు సేన సాగరము వలె అపారమైన వర్షాకాలము నందు మేఘసముదాయము ఆకాశమునువలె భూమిని కప్పివేసెను . సేన అంతా రామలక్ష్మణులను చూడవలెననే ఆత్రముతో పరుగులు తీయసాగిరి . 
అటుల ఎడతెరపి లేకుండా భరద్వాజుడు తెలిపిన మార్గములో  ప్రయాణించి చిత్రకూటము చేరిరి . దారి తెలిసిన సైనికులు ముందుగా ప్రయాణించి అచట పొగను గమనించి ,భరతుడి వద్దకు వచ్చి "ప్రభూ అచట పొగ కానవచ్చుచున్నది . పొగ వున్నచో అచట జనులు తప్పక వుండుదురు . రామలక్ష్మణులు ఉండి ఉండవచ్చు . లేదా మునులు తపమాచరించుచు ఉండవచ్చు . "అని పలికిరి . 
భరతుడు తన సేనను అచటనే ఉంచి తానూ ,మునులు ,పురోహితులు మాత్రము ముందుకు సాగిరి . భరతుని ఆజ్ఞ ప్రకారము సైనికులు అతి త్వరలో రాముని చూడబోతున్నామన్న ఆశతో ఉవ్విళ్ళూరుచు అచటనే ఉండిరి . 

రామాయణము అయోధ్యకాండ తొంబదిమూడవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment