రామాయణo
అయోధ్యకాండ -తొంబది మూడవసర్గ
అట్లు వనములో ప్రయాణించుచున్న మహా సేనను చూసి భీతిల్లిన మదపుటేనుగులు మున్నగు వన్య మృగములు తమ గుంపులతో కూడి ,పరుగులు తీసినవి . భరతుడు సేన సాగరము వలె అపారమైన వర్షాకాలము నందు మేఘసముదాయము ఆకాశమునువలె భూమిని కప్పివేసెను . సేన అంతా రామలక్ష్మణులను చూడవలెననే ఆత్రముతో పరుగులు తీయసాగిరి .
అటుల ఎడతెరపి లేకుండా భరద్వాజుడు తెలిపిన మార్గములో ప్రయాణించి చిత్రకూటము చేరిరి . దారి తెలిసిన సైనికులు ముందుగా ప్రయాణించి అచట పొగను గమనించి ,భరతుడి వద్దకు వచ్చి "ప్రభూ అచట పొగ కానవచ్చుచున్నది . పొగ వున్నచో అచట జనులు తప్పక వుండుదురు . రామలక్ష్మణులు ఉండి ఉండవచ్చు . లేదా మునులు తపమాచరించుచు ఉండవచ్చు . "అని పలికిరి .
భరతుడు తన సేనను అచటనే ఉంచి తానూ ,మునులు ,పురోహితులు మాత్రము ముందుకు సాగిరి . భరతుని ఆజ్ఞ ప్రకారము సైనికులు అతి త్వరలో రాముని చూడబోతున్నామన్న ఆశతో ఉవ్విళ్ళూరుచు అచటనే ఉండిరి .
No comments:
Post a Comment