దీపారాధన
దీపారాధన వెండి ,ఇత్తడి,రాగి,లేదా మట్టి ప్రమిదల్లో చేయవచ్చు .స్టీలు కుందులలో దీపారాధన చేయరాదు . రెండు వత్తులు కచ్చితం గా వుండాలి . ఏక వత్తి వెలిగించుట మహా దోషము. ఏక వత్తిని శవం వద్ద వెలిగిస్తారు .
పరమేశ్వరునికి ఎడమవైపు ,విష్ణు మూర్తికి కుడివైపు దీపాన్ని ఉంచాలి . ఎదురుగా వుంచరాదు . నిత్య దీపారాధన సకల శుభప్రదం . దీపాన్ని అగరవత్తి తో వెలిగించాలి అగ్గిపుల్లతో వెలిగించరాదు . తామర వత్తుల(తమర పూవు కాదను విరిచి దానిని నలిపి పొడుగ్గా దరాలలా విడదీసి నీడలో 7 రోజులు ఆరబెట్టి వాటిని మామూలు వత్తి మద్యలో పెట్టి తయారు చేసిన వత్తి )తో దీపారాధన లక్ష్మి దేవికి అత్యంత ప్రీతికరం . రోజు దీపారాధన చేయడం వల్ల దుష్ట శక్తులు దరిచేరవు . రోజు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి . ఒక్కోసారి దీపారాధన చేయడం కుదరకపోవచ్చు . అలాంటి దోషాలు నివృత్తి అయ్యేందుకు గాను కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగిస్తారు . దీపారాధన కొన్దేక్కితే 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించి తిరిగి దీపారాధన చేయవలెను .
సర్వే జనాం సుఖినో భవంతు .
No comments:
Post a Comment