వినాయకుడి పూజకు తులసి నిషిద్దం
వినాయక చవితి రోజున బొజ్జ గణపయ్యని వివిధ పత్రాలతో పోటా పోటీగా పూజ చేస్తారు . కాని వాటిలో తులసి ఉపయోగించరాదు . కారణమేమనగా ఒక పర్యాయం గంగా నదీ తీరంలో గణ నాధుడు విహరించు సమయమున ధర్మద్వజ యువరాణి శివ పుత్రుడిని చూసి మోహించి వివాహం చేసుకోమని కోరగా ,అందులకు ఆయన కాదనడంతో ఆమె కోపించి దీర్ఘకాలం భ్రహ్మ చారిగా ఉండమని శపించింది . ప్రతిగా పార్వతీ పుత్రుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని శపించాడు . లంబోదరుడి శాపానికి చింతించి ధర్మద్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని అర్దించగా విఘ్నేశ్వరుడు శాంతించి రాక్షసుడి చెంత కొంత కాలం ఉండి ,తరువాత పవిత్రమయిన తులసిగా జన్మిస్తావు అని వరం ఇచ్చాడు .
కావున వినాయకుడికి తులసిని తన పూజలోవినియోగించుట ఇష్టముండదు .
శశి
ఎం . ఎ ,తెలుగు పండితులు .
No comments:
Post a Comment