Monday 29 February 2016

లలితా సహస్ర నామ ఫలం

లలితా సహస్ర నామ ఫలం  

ప్రతి రోజు లలితా సహస్ర నామాన్ని చదవడం మహా ఫలం . అలా వీలుకాని వారు శుక్రువారం చదివితే మంచిదే . 
అనగా లలితా దేవి కొంతకాలం కదంబ వనం లో నివసించింది . ఆవిడకు కదంబ వనం అంటే చాలా ఇష్టం . కావున కదంబ వృక్షం కింద కుర్చుని 11 రోజులు గాని 21 రోజులు కాని లలితా సహస్ర నామాన్ని పారాయణం చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది . మరియు అనుకున్న కార్యాలు తప్పక జరుగుతాయి . 
కదంబ పుష్పం 
ఆస్థి అనగా ఎముకలు . ఈ మంత్రాన్ని ఎముకలు విరిగిన వారు రోజు 108 సార్లు జపం చేసి నానపెట్టిన పెసలు అమ్మ కు నైవేద్యం పెడితే ఎముకలు చాలా త్వరగా సరవుతాయి . బందులు అయిన ఈ మంత్ర జపం చేసి తీర్ధాన్ని ఇచ్చినా ఎముకలు సరి అవుతాయి . 
పుణ్య ఘడియల్లో ,పుణ్య తిదులలో లలితా సహస్ర నామ పారాయణ పలితం ఎన్నో రెట్లు ఎక్కువగా లభిస్తుంది . అలాగే కుటుంభ సబ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంభ శాంతి . పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తూ చదవడం వల్ల సాక్షాత్ లలితాదేవి ఎదురుగా చదివన పలితం కలుగుతుంది . 
లలితాదేవికి కలువలు ,మారేడు దళాలు ,తులసి దళాలు,మల్లెపూలు ఇష్టం . వాటితో పూజిస్తే అమ్మ త్వరగా ప్రసంనమవుతుంది . అలాగే నైవేద్యముగా పాయసము ,పులగము,చిత్రాన్నము (పులిహోర )దానిమ్మ,బూడిద గుమ్మడికాయ ప్రీతీ . 
కావున పూజకు పిదప  లలితాదేవికి పైన చెప్పినవి నైవేద్యము పెట్టిన సకల శుభ ప్రదం . 

   లలితాదేవ్యయై నమః 

                                                                                                        శశి 
                                                                                   ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు  














No comments:

Post a Comment