కోరికలు నెరవేరడానికి పటించవలసిన రామాయణ ఘట్టములు
రామ కధ మధురము మాత్రమే కాదు . దాని నుండి నేర్చుకోవసినది కూడా ఎంతో వుంది . రామాయణం లో పెద్దలు గురువుల పట్ల భక్తి శ్రద్దలు ,స్త్రీలను గౌరవించడం ,భార్యా భర్తల అన్యోన్యత ,అన్నదమ్ముల ఆప్యాయత ,సత్య వాక్యానికి కట్టుబడటం ,ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం ను తప్పకపోవడం ఇలా ఎన్నో వున్నాయి . ప్రస్తుత సమాజములో మానవ సంభందాలు బలహీనమవుతున్న తరుణములో వీటిని గ్రహించడం అత్యంత ఆవశ్యకము .రామ నామ మహిమతో పాటు రామాయణ మహిమ కూడా అష్టాదశ పురాణాలలో సవిస్తారముగా వివరింపబడింది . రామాయణం లో ఒక్కో ఘట్టము ఒక్కో ఆణిముత్యము . కలియుగములో మానవుల సకల కోరికలు తీర్చే కల్పవృక్షము రామాయణము అనడం లో ఎ సందేహము లేదు .
కోరికలు నెరవేరడానికి పటించవలిసిన రామాయణ ఘట్టాలు ;
1. ధర్మ కార్యముల సిద్ధికై ;
ధర్మ కార్యముల సిద్ధికై అయోధ్య కాన్డలోని కౌసల్య రామ సంవాదము 21,22,23,24,25 సర్గములను పారాయణ చేసి 5 అరిటి పళ్ళను నివేదన చేయాలి .
2. ధన లాభముకై ;
అయోధ్యా కాండ లోని ,32 వ సర్గలోని ,యాత్రా దానము అను ఘట్టమును పారాయణ చేసి 5 అరిటి పళ్ళను నివేదన చేయాలి .
3. వివాహము జరుగుట కై ;
బాల కాండ లోని ,73 సర్గలోని ,సీతా కళ్యాణ ఘట్టము ను పారాయణ చేసి అప్పుడే పితికిన పాలను నివేదన చేయవలెను .
4 . మోక్ష ప్రాప్తికై ;
అరణ్య కాండ లోని ,65 ,66,67,68 సర్గలలోని,జటాయు మోక్ష ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను .
5 . సకల రోగ నివారణకు ;
యుద్ద కాండ లోని ,59 వ సర్గలోని ,రావణ కిరీట భంగ ఘట్టమును పారాయణ చేసి ప్రారంభములో తేనె సమాప్తిలో పాలు నివేదన చేయవలెను .
6. భూత పిశాచ బాధల నివృత్తికై ;
సుందర కాండ లోని ,3 వ సర్గ లోని ,లంకా విజయము ఘట్టమును పారాయణ చేసి చెక్కెరపొంగలి నివేదన చేయవలెను .
7 . చిత్త భ్రమ తొలగుటకై ;
సుందర కాండ లోని ,13 వ సర్గ లోని ,మారుతి నిర్వీదము ఘట్టమును పారాయణ చేసి మినుముల పొడి కలిపిన అన్నమును నివేదన చేయవలెను .
8. దారిద్ర నివృత్తికై ;
సుందర కాండ లోని,15 వ సర్గ లోని ,హనుమత్క్రుత సీత దర్శనము ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను .
9. సకల దుఖ నివృత్తికై ;
యుద్ద కాన్దలోని, 116 వ సర్గ లోని ,సీతాంజనేయ సంవాద ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను .
10 . ఆపదను వారించుటకై ;
యుద్ద కాండ లోని ,18 ,19 సర్గలలోని ,విభీషణ సంగ్రహ ఘట్టమును పారాయణ చేసి టెంకాయ నివేదన చేయవలెను .
11. భందువు స్వస్థానము చేరుటకై ;
సుందర కాండ లోని ,36 వ సర్గ లోని ,అంగుళీయ ప్రధాన ఘట్టమును పారాయణ చేసి పనస పండు మామిడి పండు లను నివేదన చేయవలెను .
12. దుస్వప్న దోష శాంతికి ;
సుందర కాండ లోని ,27 వ సర్గలోని ,తిజటా స్వప్న వృత్తాంత ఘట్టమును పారాయణ చేసి పంచదార నివేదన చేయవలెను .
13. జన్మాన్తరమున సకల శుక ప్రాప్తికి ;
యుద్ద కాండ లోని ,131 వ సర్గ లోని ,శ్రీ రామ పట్టాభిషేక ఘట్టమును పారాయణ చేసి పెసరపప్పు చేర్చిన ఉప్పు పొంగలి నివేదన చేయవలెను .
14. పుత్ర సంతాన ప్రాప్తికై ;
బాల కాండ లోని ,15 ,16 సర్గలలోని పుత్ర కామేష్టి ఘట్టమును పారాయణ చేసి నేయి కలిపినా పాయసమును నివేదన చేయవలెను .
15 . సుఖ ప్రసవమునకు ;
బాల కాండ లోని 18 వ సర్గ లోని శ్రీ రామావతార ఘట్టమును పారాయణ చేసి ఆ సమయములో దొరకు పళ్ళను నివేదన చేయవలెను .
16 . కారా గృహ భయ నివృత్తికి ;
యుద్ద కాండ లోని ,117 వ సర్గ లోని ,సీతా నయన ఘట్టమును పారాయణ చేసి తీపి వస్తువును నివేదన చేయవలెను .
17 . సంతానమునకు సద్భుద్ది కలుగుటకై ;
అయోధ్య కాండ లోని ,1,2 ల సర్గ ల లోని శ్రీ రామ గుణ వర్ణన ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను .
18 . సకలాభీష్ట కార్య సిద్ధికై ;
బాల కాండ లోని 75,76 సర్గలలోని భార్గవ విజయ ఘట్టమును పారాయణ చేసి పాయసము అప్పాలు నివేదన చేయవలెను .
19 . రాజ ద్వారమున సర్వానుకుల సిద్ధికై ;
అయోధ్య కాండ లోని ,100 వ సర్గ లోని ,శ్రీ రాముని చే భరతుడికి రాజ ధర్మోపదేశము ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను .
భక్తి తో శ్రీ రాముడి మీదనే ద్యాసను వుంచి మండల కాలము (40 లేదా 45 రోజులు )భక్తి తో పారాయణ చేసిన ఫలితము తప్పక కలుగుతుంది .
అందరికి ఆ శ్రీ రామ రక్ష లభించు గాక
శశి ,
ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు .