Saturday 30 April 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -7)

          సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -7)

వీరభద్రుడు ,రుద్ర గణములు యజ్ఞ వాటిక వద్దకు వచ్చి అక్కడ వున్నా వారందరినీ దొరికిన వారిని దొరికినట్లు చితక భాదు చుండెను . అది చుసిన ఇంద్రుడు ,అగ్ని ,వరుణ ,యముడు ,గందవాహనులు మొదలైన వారు వారిని ఎదుర్కున్నారు . వీర భద్రుడు ప్రచండ నాట్యం చేయుచు యజ్ఞ వాటిక అంతా దొరికిన వారిని చిదక తన్నుతూ వీర విహారము చేసెను . అజేయుడయిన వీరాభాద్రుడిని చూసి ,తాము శివ భక్తులమే అని విధి ప్రేరణ వాళ్ళ ఇక్కడికి వచ్చామని ,శివ నింద చేసినవారు ఫలితము అనుభవించక తప్పదు కావున దక్షుడిని చేరమని ,ఇంద్రుడు మొదలైన వారు పలుకగా వీరభద్రుడు ప్రీతీ చెంది వారిని విడిచిపెట్టెను . అప్పుడు భయపడిన మహా మునులు విదాతను శరణు వేడగా అతడు వారితో గూడి విష్ణుమూర్తిని శరణు వేడెను . 
విష్ణుమూర్తి శరణా గత రక్షకుడు అగుట చేత వీర భద్రుడితో యుద్దము చేయ ప్రారంభించెను . వారిరువునకు ఘోర యుద్దము జరుగుచుండ వీరభద్రుడు నారాయణుని త్రిశులముతో బోడవగా విష్ణుమూర్తి భూమి మీద పడెను . మునులు ,దేవతలు మిక్కిలి ఆశ్చర్యము పొందారు . లేచిన విష్ణుమూర్తి కోపావేశాముతో సుదర్శన చక్రమును ప్రయోగించెను . వీరభద్రుడు శివుడిని తలుచుకోగానే అది కదలక వున్నా చోటే వుండిపోయేను . విష్ణువు ఎన్ని అస్త్ర శస్త్రములను ప్రయోగించినా వీరభద్రుడు వాటిని  ముక్కలుగా చేసెను . 


అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తితో రహస్యముగా" కానున్నది కాకమానదు మనము ఇక్కడనుండి వేల్లిపోదాము "అని చెప్పెను . అప్పుడు విష్ణుమూర్తి సూక్ష్మ రూపము ధరించి అక్కడనుండి వెళ్ళిపోయెను . బ్రహ్మ కుడా అలాగే తపోవనమునకు వెళ్ళిపోయెను . అంత వీరభద్రుడు దక్షుని శిరమును ఖండించి విజయుడయ్యెను . పరమేశ్వరుని వద్దకు వెళ్లి విజయ వార్త తెలుపగా అతడు సంతసించి వీరభాద్రుడిని గణమునకు అద్యక్షుడిగా చేసెను . 


                     శశి ,

ఎం . ఎ (తెలుగు )తెలుగు పండితులు . 






No comments:

Post a Comment