సతీ దేవి వృత్తాంతం ( పార్ట్ 2)
ఆ విధంగా దక్షుని పుత్రిక గా పెరిగిన సతీ దేవి శివుడిని భర్తగా చేసుకో గోరి "నందావ్రతం "ను ఆచరించెను . అంత శివుడి ప్రత్యక్షమై వరము కోరుకోమనగా సతీ దేవి వివాహము చేసుకోమని కోరుకొనెను . దక్షుడు అది తెలుసుకుని సంతోషించి అందర్ని పిలిచి వివాహ ఏర్పాట్లు చేసెను . అంత శివానుమతితో బ్రహ్మ వధువరులను యాగశాల వద్దకు రప్పించి యజ్ఞ ప్రతిష్ట ఒనరించి విధి ప్రకారము హోమము నిర్వహించి వధూ వరుల చేత అగ్ని ప్రదక్షణ చేయించెను . ఆ సమయములో సతీ దేవి పాదములను చుసిన బ్రహ్మ దేవుడికి మనసు గతి తప్పెను . అప్పుడు ఆయన నుండి ద్రోణ సంవర్తకములు అను పేర్లు కల మేఘములు పుట్టి శివుడి ఆజ్ఞ తో ఆకాశానికి వెళ్ళెను . బ్రహ్మ ఒనరించిన నేరమునకు శివుడు శిక్షింప భూనినపుడు అక్కడ వున్న దేవతలు పరివారము జనులు అందరు విదాతను మన్నిమ్పమని వేడుకొనగా శివుడు కరుణించి వదిలివేసెను . తదుపరి ఆ నూతన దంపతులు కైలాసము చేరి అందరిని సముచితముగా వస్త్ర ఆభరణముల తో గౌరవించెను అంతట వచ్చిన వారందరూ తమ తమ గృహములకు వెడలగా నందీశ్వరుడిని వాకిట వుంచి సతీ దేవి తన అంతః పురమున ప్రవేశించెను .
ఆ విధముగా సతీ దేవిని వివాహము చేసుకున్న పరమేశ్వరుడు ముల్లోకములచే పూజలు అందుకుంటూ కైలాసమున ఉండెను .
సర్వేజనా సుఖినో భవంతు .
శశి ,
ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment