సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -3)
ఒకానొక సమయములో మునులందరూ కలసి ప్రయాగ క్షేత్రమున ఒక గొప్ప యాగము చేయ సంకల్పించినారు . తపోధనులను ,విజ్ఞానులను ,ఆత్మజ్ఞానులను ,లోకపాలురను ఆహ్వానించారు . ఆ యాగమునకు దక్ష ప్రజాపతి తన పరివారముతో కుడి రాగా మునులు దేవతలు ఎదురేగి ఆహ్వానించారు . నిర్వికారుడు ,ఆదిమద్యాంత రహితుడు అయిన ఆ అది దేవుడు మాత్రం వున్నా చోటే మాట్లాడక ఉండెను . ఆ కారణం వలన దక్షప్రజాపతికి పరమేశ్వరుడు అంటే కోపం వచ్చి శివుడిని నిందించి ,దేవతలు మునులు చెప్పినా వినక నిజ గృహమునకు వెళ్ళెను . ఆ సమయములో నంది శివుడిని నిందిస్తూ పలికిన మాటలు వినలేక "శివ దుషానము చేసిన నీ తల తెగి హోమములో పడుతుంది . "అని శపించెను . దానికి దక్షుడు "మీ శివ గణము పాషండు లై వేద క్రియా చరణలు కోల్పోఎదరు గాక "అని ప్రతి శాపం ఇచ్చెను . తరువాత ఆ యాగము జయప్రదముగా ముగిసెను .
ఇంటికి వెళ్ళిన దక్షుడు పరమేశ్వరుడి అందు ద్వేష భావముతో ,కోపముతో రగిలిపోతు ఉండెను . పరమేశ్వరుడిని అవమానింప ఒక యాగము చేయ తలపెట్టెను .
సర్వే జనా సుఖినో భవంతు .
శశి ,
ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు .
0
No comments:
Post a Comment