రామ కధామృతము
విష్ణు మూర్తి దశావతారాలలో ఎంతో విశిష్టమైనది రామావతారము . ఎటువంటి మాయలు ప్రదర్శించకుండా ఎన్నో కష్టాలకు వోర్చి ధర్మాన్ని నిలబెట్టిన మహాను భావుడు ఇక్ష్వాకు కుల తిలకుడు శ్రీ రాముడు . ఎన్ని యుగాలు గడిచినా ఆడపిల్లలు రాముడి లాంటి భర్త కావాలని ,తండ్రి తన కొడుకు రాముడు లా వుండాలని కోరుకుంటున్నారు . రాముడు మంచి బాలుడు అనే వాక్యం మనం చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు వింటూనే ఉంటాము అంటే రాముడు ఎంతటి శుభ లక్షణ శోభితుడో స్పష్టంగా అర్ధమవుతుంది .
ఇక సీతా దేవి పతివ్రత, పరమ సాధ్వి ,అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని ,ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్న స్త్రీ జాతి ఆణిముత్యం సీత .
రామాయణం లోని భాగాలను కాండలు అంటారు .
రామ జన్మ వృత్తాంతం ;
అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని అయోధ్యను పరిపాలిస్తున్న దశరధ మహా రాజు పుత్రులు లేరనే భాధతో పుత్రార్ది అయి ఋష్యశృంగుని బ్రహ్మత్వంలో పుత్ర కామేష్టి యజ్ఞాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో చక్కగా ఆచరించాడు . తత్ ఫలితం గా యజ్ఞ ప్రసాద మహత్తు చే దశరద మహారాజుకు తన ముగ్గురు పట్ట పురాణుల నందు నలుగురు కుమారులు రామ ,లక్ష్మణ ,భరత,శతృజ్ఞులు జనియించినారు . ముద్దు మురిపాలతో రాకుమారులు నలుగురూ అయోధ్యలో పెరిగి పెద్దవారవుతున్నారు .
సీతా జన్మ వృత్తాంతం ;
మిధిలా రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నాడు . ఆయనకు పిల్లలు లేని కారణం గా చింతతో ఉండెను . ఒకనాడు ఆయన యజ్ఞం చేసి భూమిని దున్నుతుండగా భూమిలో పసిపాప దొరికింది ఆ పాపే సీతాదేవి . తరువాత జనక మహారాజుకి ఊర్మిళ జన్మించింది . జనక మహారాజు తమ్ముడు కుశ ద్వజుడికి మాండవి ,శ్రుతకీర్తి జన్మించారు . నలుగురు అక్కచెల్లెళ్ళు ఎంతో అన్యోన్యం గా పెరుగుతున్నారు .
విశ్వామిత్రుడి రాక ;
విశామిత్రుడు తన యాగ పరిరక్షనార్ధం రాముడిని తీసుకు వెళ్లాలని భావించి అయోధ్యకు వచ్చి దశరధ మహా రాజుని రాముడిని పంపించమని అడుగుతాడు . దశరధుడు మొదట భయపడినా తన కుల గురువు వశిష్టుడు చెప్పడంతో పంపిస్తాడు . విశ్వామిత్రుడి వెనక వెళ్ళిన రామ లక్ష్మణులు బల, అతిబల ,దండ చక్ర ,ధర్మ చక్ర ,కాల చక్ర ,విఘ్న చక్ర ,ఐషీక , ఐంద్ర ,వజ్ర ,ఆగ్నేయ వాయువ్య ,వారుణాస్త్రాలు వాటి ఉపసంహరనలు విశ్వామిత్రుడి వలన పొందారు .
విశ్వామిత్రుడి యజ్ఞానికి కావలి కాసి దానిని పాడు చేయడానికి వచ్చిన మారీచ సుభాహులను ఎదుర్కుని యజ్ఞాన్ని సంపూర్ణమయ్యేలా చేసారు . తదుపరి విశ్వామిత్రుడితో శివ ధనస్సు సందర్శనార్ధం మిధిలా నగరానికి వెళ్ళారు . మార్గ మద్యములో అహల్యకు శాప విమోచనం కావించాడు పరం పావన మూర్తి శ్రీరాముడు .
సీతా స్వయం వరములో శివధనుర్భగము ద్వారా సీతా రాముల వివాహం నిశ్చయమైనది . ఇరువురి కుల గురువుల ప్రోద్బల్యం తో రాముడు -సీత ,లక్ష్మణుడు -ఊర్మిళ ,భరతుడు -మాండవి ,శాత్రుగ్నుడు -శ్రుతకీర్తి ల వివాహములు అంగరంగ వైభవముగా జరిగాయి .
సీతా రాముల వనవాసం ;
రాకుమారుల వివాహము కొత్త కోడళ్ళ రాకతో అయోధ్యా ప్రజలు రాజ మందిరము ఆనందములో మునిగి వున్నారు . కొంత కాలానికి ధశరద మహారాజుకి తన కుమారుడు రాముడికి రాజ్య భారాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని ఏర్పాట్లు చేస్తాడు . కాని ధశరదుడి చిన్న భార్య కైక మంధర వుద్భోదతో తనకు ఇస్తానన్న వరాలను ఇప్పుడు ఇవ్వమని ఆ వరాలు భరతుడిని రాజ్యాభిషిక్తుడిని చేయడం ,రాముడిని వనవాసానికి పంపడం . అని కోరుకుంది . రామ వియోగాన్ని వుహించలేని మహారాజు కుప్పకులిపోతాడు . రాముడు జరిగిన వృత్తాంతాని తెలుసుకుని ,లక్ష్మణుడు ,సీత వెంట రాగ వనవాసానికి బయలుదేరతాడు . రాముడి మీద అభిమానం తో అయోధ్యా వాసులు చాలా దూరం రాముడి వెంటే వెళ్ళారు .
అరణ్య వాసం లో సీతా రాములు కొంత కాలం చిత్రకూటం మీద తదుపరి పచవటిన నివసించారు . ఆ సమయములలో శ్రీరాముడు అనేక మంది రాక్షసులను హతమార్చి జగానికి శాంతిని కలుగజేసెను ఆ సమయములోనే శుర్పనఖ ముక్కు చెవులను కోసాడు లక్ష్మణుడు .
శూర్పనఖ మాయ మాటలు నమ్మిన రావణుడు మారీచుని బంగారు లేడిగా మారమని ,ఆ లేడిని వెంబడిస్తూ రాముడు వల్లగ సీతను అపహరించి లంకకు తీసుకు వెళ్లి తన అశోక వనము నందు ఉంచెను . సీతకోరకు రాముడు ఎంతో విలపించెను . వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా చేసెను . ఆంజనేయుడు సీతా జాడ కనిపెట్టి చెప్పెను . ఆంజనేయుడు ,సుగ్రీవుడు ,జామ్భావంతుడు , మొదలగు వానరులంతా తోడు నిలువగా ,లంక పై దండెత్తి రావణుడిని సంహరించి సీత ను చెర విడిపించెను . సీతా సమేతుడై శ్రీ రాముడు అయోధ్యకు వెళ్ళెను . అక్కడ సీతారాముల పట్టాభిషేకము ఎంతో దివ్యముగా అత్యంత వైభవముగా జరిగెను . శ్రీ రాముడు ప్రజానురంజకముగా రాజ్యమును పాలించెను . శ్రీ రాముడి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో వుండేవారు . వానలు సకాలంలో పది పంటలు సుభిక్షముగా పండేవి . కావుననే నేటికి రామ రాజ్యము అను నానుడి ప్రజలలో వినుపించును . రామ నామం రాయడం చేతనే రాళ్ళు కూడా లంకకు వారధి కట్టు సమయములో సముద్రములో తేలి ఆడినవి . అంతటి గొప్ప శక్తి కలిగినది రామ నామము .మంగళ కారుడు శ్రీ రాముడు . నమ్మిన వారిని కాచే దైవం సీతాపతి .
జనులందరికి శ్రీ రామ రక్షా కలుగు గాక
సర్వ్ జన సుఖినో భవంతు .
No comments:
Post a Comment