Thursday 10 November 2016

రామాయణము అయోధ్య కాండ --ముప్పదితొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                 అయోధ్య కాండ --ముప్పదితొమ్మిదవసర్గ 

భార్యలతో కూడి వున్న దశరథ మహారాజు శ్రీరాముడు పలికిన మాటలు విని నిస్చేష్టుడయ్యెను . దుఃఖభారంతో కన్నులలో నీళ్లు నిండివుండగా ఆ మహారాజు రాముని చూడలేకపోయెను . అతి కష్టము మీద చూసినా మాట్లాడలేకపోయెను . ఎల్లప్పుడూ మేలురకములైన పట్టువస్త్రములలో శ్రీరాముడిని చూసే దశరధుడు నారచీరలలో ఆయనను చూసి భాద తట్టుకొనలేక మూర్చితుడయ్యెను . కొంతసేపటికి తేరుకుని రామా రామా !అని కలవరించుతూ మంత్రి సుమంత్రుడిని పిలిచి" రధము మీద రాముని తో పాటు కొంత దూరము నీవు కూడా వేళ్ళు . నా ధనాగారము నుండి 14 సంవత్సరములకు సరిపడా  మేలురకములైన వస్త్రములు ,ఆభరణములు తెప్పించి సీతకు ఇమ్ము "అని ఆజ్ఞాపించెను . 
సుమంత్రుడు దశరధుడు ఆజ్ఞ మేరకు మేలుజాతి గుఱ్ఱములతో రధమును తెచ్చెను . సీత తనకు ఇవ్వబడిన ఆభరణములను ధరించేను . అప్పుడు కౌశల్య సీతాదేవితో పతివ్రతలు ఆచరించవలసిన ధర్మములను ,భర్తకు చేయవలసిన సేవలను ,ఇవ్వవలసిన విలువను వివరించి చెప్పెను . సీతాదేవి ఎంతో వినమ్రతతో ఆ మాటలు అన్నీ విని తప్పక వాటిని ఆచరిస్తానని పలికెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment