రామాయణము
అయోధ్యకాండ -ముప్పదిమూడవసర్గ
సీతారామలక్ష్మణులు బ్ర్రాహ్మణోత్తములకు విరివిగా దానములు ఇచ్చి ,తండ్రి అయిన దశరథ మహారాజు ను దర్శించుటకై బయలుదేరిరి . ఆ విధముగా ఆయుధములు ధరించి నడచి వెళ్తున్న వారిని చూచుటకు జనములు వీధులు కాలి లేక తమ ఇండ్లపైకి ఎక్కి చూడసాగిరి . ఆ విధముగా వెళ్తున్న సీతారామలక్ష్మణులు చూసి మిక్కిలి దుఃఖితులయ్యిరి . తండ్రి మాటకై వనములకు వెళ్తున్న సీతారామలక్ష్మణులు వనములో ఇబ్బంది పడునని జనులంతా శోకములో మునిగిపోయిరి .
మరియు వారిలోవారు మనము కూడా రాముడితో పాటు వనములకు వెళ్ళెదము . అప్పుడు మన గృహములలో నిధులు దొంగలు తృవ్వుకొనిపోవుదురు . ఇళ్లన్నీ బూజులు పట్టి వాకిట ముగ్గులు వేసేవారులేక పాడుపడినట్లుండును . అటువంటి ఇల్లు కలిగిన ఈ అయోధ్యను ఆ కైకేయి తన కొడుకుతో పాటు ఏలుకుంటుంది . రాముడు వున్నది అరణ్యమైనా మనకు అయోధ్య వలె ఉండును . మనమందరము సమూహముగా వెళ్ళుటచే అక్కడి క్రూరమృగములన్నీ వనము వదిలి వెళ్లిపోవును . కావున మనము రాముని చూస్తూ హాయిగా కాలము గడపవచ్చు . అని నిర్ణయముకు వచ్చిరి .
రాముడు ఆ వీధులన్నీ దాటి తండ్రి భవనమున ప్రవేశించెను . అక్కడి వారందరు ఎంతో దుఃఖితులై ఉండిరి . రాముడు తన ఆగమనం గూర్చి తండ్రికి తెలియబరుచుటకు సుమంత్రుడి వద్దకు వెళ్లి తన రాకను మహారాజుకి నివేదింపమని కోరెను .
రామాయణము అయోధ్యకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment