Tuesday 1 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదిఒకటవసర్గ

                              రామాయణము 

                            అయోధ్యకాండ -ముప్పదిఒకటవసర్గ         

కౌశల్యా దేవి గృహము నుండి రాముని వెంటే వచ్చిన లక్ష్మణుడు సీతారాముల సంభాషణ విని ,తానూ కూడా వనములకు వచ్చుటకు తన అన్నాను ఎలా ఒప్పించాలా ?అని ఆలోచించసాగెను . ఆయన రాముడి పాదములపై పడి సీతాదేవిని ప్రార్ధించి "అన్నా !నీవు వనములకు వెళ్ళవలెననే నిర్ణయించుకొన్నచో నేను కూడా నీతో వనములకు వచ్చెదను దయతో కాదనకు నీవు లేని అయోధ్య నాకు నరకములో సమానము "అని వేడుకొనెను . 
అప్పుడు రాముడు నీవు నాతొ వచ్చినచో తల్లి కౌశల్యను ,సుమిత్రను ఎవరు జాగ్రత్తగా  చూసుకుంటారు . నేను ,సీతా లేకపోవుటచే ఆ తల్లులు ఇరువురు బాధతో క్రుంగి పోవుదురు . ఇక నీవు కూడా లేకపోతె వారి మంచి చెడు పట్టించుకునేది ఎవరు ?కనుక నీవు ఇక్కడే ఉండుము . అని చెప్పెను . 
అప్పుడు లక్ష్మణుడు "అన్నా !కౌశల్యా దేవి గారిని ఒకరు చూసుకొనవలసిన అవసరము లేదు . ఆవిడ ను ఆశ్రయించుకున్నవారిని ,మా తల్లి గారైన సుమిత్రాదేవిని కూడా చూసుకొనుటకు కౌశల్యాదేవికి వేళా ఏకారముల భూములు కలవు . అదీకాక భరతుడు నీ వలెనే తల్లితండ్రుల పట్ల అపారమైన గౌరవ మర్యాదలు కలవాడు  కావున అతడు తల్లులను జాగ్రత్తగా చూసుకొనగలడు . 
కావున నన్నునూ మీతో పాటు రానివ్వుడు "అని పలికెను . అంత రాముడు లక్ష్మణుడు వనములకు వచ్చుటకు రాముడు అంగీకరించెను . అప్పుడు రాముడు వశిష్ట మహర్షి మహర్షి ఇంట వున్నదివ్య ఆయోధములను వెంటనే తీసురమ్మని ఆజ్ఞాపించెను . అప్పుడు లక్ష్మణుడు తన వారి వద్ద వనవాస గమనమునకు అనుమతి తీసుకుని వశిష్ట గృహమున కల ఆయుధములు తెచ్చి అన్నగారికి చూపించెను . అప్పుడు రాముడు లక్ష్మణుడి గమన వేగతను  మెచ్చుకుని బ్ర్రాహ్మణోత్తములకు దానములు ఇవ్వదలిచాను . వశిష్టుని పుత్రుడైన సుయజ్ఞుని ,ఇంకా గొప్ప వారైన బ్రాహ్మణోత్తములను వెంటనే తీసుకురమ్ము "అని ఆజ్ఞాపించెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదిఒకటవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





























No comments:

Post a Comment