Sunday 20 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదినాల్గవసర్గ

                             రామాయణము 

                  అయోధ్యకాండ -నలుబదినాల్గవసర్గ 

ఉత్తమ వనిత అయిన కౌశల్యా దేవి ఆవిధముగా విలపించుచుండగా విశిష్ట ధర్మములు తెలిసిన సుమిత్రాదేవి "రాముడు మిక్కిలి బలపరాక్రమములు కలిగిన రాముడికి ఏ అపకారము కలగదు రాముడు తోడుగా ఉండగా సీతా ఏ ఇబ్బంది ,చింత లేక వనములోనైనా సుఖముగా ఉండగలదు . అతి త్వరలో రాముడు తిరిగి వచ్చి అయోధ్యను ఏలగలడు కావున చింతించవలదు . శ్రీరామునికి అనేక దివ్యాస్త్రములు తోడుగా కలవు . కావున ఏ చిన్న ఇబ్బంది కూడా వారికి వనములో కలుగజాలదు "అని పరిపరి విధములుగా ఓదార్చసాగెను . 
సుమిత్రాదేవి ఆవిధముగా ఓదార్చగా కౌశల్యాదేవి బాధ అంతా తొలగిపోయి భవిష్యత్తు మీదకల ఆశతో ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబదినాల్గవసర్గసమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment