రామాయణము
అయోధ్యకాండ -నలుబదినాల్గవసర్గ
ఉత్తమ వనిత అయిన కౌశల్యా దేవి ఆవిధముగా విలపించుచుండగా విశిష్ట ధర్మములు తెలిసిన సుమిత్రాదేవి "రాముడు మిక్కిలి బలపరాక్రమములు కలిగిన రాముడికి ఏ అపకారము కలగదు రాముడు తోడుగా ఉండగా సీతా ఏ ఇబ్బంది ,చింత లేక వనములోనైనా సుఖముగా ఉండగలదు . అతి త్వరలో రాముడు తిరిగి వచ్చి అయోధ్యను ఏలగలడు కావున చింతించవలదు . శ్రీరామునికి అనేక దివ్యాస్త్రములు తోడుగా కలవు . కావున ఏ చిన్న ఇబ్బంది కూడా వారికి వనములో కలుగజాలదు "అని పరిపరి విధములుగా ఓదార్చసాగెను .
సుమిత్రాదేవి ఆవిధముగా ఓదార్చగా కౌశల్యాదేవి బాధ అంతా తొలగిపోయి భవిష్యత్తు మీదకల ఆశతో ఉండెను .
రామాయణము అయోధ్యకాండ నలుబదినాల్గవసర్గసమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment