Wednesday 2 November 2016

రామాయణము అయోధ్యకాండ -ముప్పదిరెండవసర్గ

                                 రామాయణము 

                       అయోధ్యకాండ -ముప్పదిరెండవసర్గ 

లక్ష్మణుడు అన్న గారి ఆజ్ఞ మేరకు కులగురువు వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుని ఇంటకు వెళ్లి ఆయనను వెంట పెట్టుకుని తీసుకువచ్చెను . ఆయన రాక గురించి తీసిన శ్రీరాముడు సీతాసమేతుడై ఎదురేగి సాదరముగా ఆహ్వానించి ,ఆయనకు తన ఆమూలాయమైన ఆభరణములను ఇంకా అనేక రకములైన బంగారు ,వజ్ర ,రత్నములు మొదలయిన విలువైన వస్తువులను ఇచ్చి "నిర్మలమైన హృదయము కల ఓ మిత్రమా !సీతాదేవి నాతోకూడి వనములకు వచ్చుచున్నది . కావున తన ఆభరణములను మీ భార్య కొఱకు ఇవ్వకోరుచున్నది . ఇంకనూ కొన్ని విలువైన వస్తువులను ఇవ్వకోరుచున్నది కావున దయతో గ్రహించుడు . "అని పలికి సీతాదేవిచే అవన్నీ ఇప్పించేను . శ్రీరాముడి మేనమామ ఇచ్చిన 'శత్రుజయము 'అనే మదగజమును వేయి ఏనుగులను .వేయి బంగారు నాణెములను సుయజ్ఞునికి ఇచ్చెను . 
అంత రాముడు లక్ష్మణుడిని పిలిచి బ్రాహ్మణోత్తములను ఇలిచి వారికి సమృద్ధిగా బంగారము ,డబ్బు ,పట్టు వస్త్రములు వేలకొలదిగా దానము చేయమని ఆజ్ఞాపించెను . అంతః ఉరమున కల దాసదాసీ జనములకు సమృద్ధిగా కానుకలు ఇచ్చెను . రాముడు తన కోశాగారము కల దానము నంతా తెప్పించి కుప్పగా పోయించెను . ఆ ధనము నంతా బ్ర్రాహ్మణోత్తములకు ,దాస దాసీ జనములకు ఇచ్చివేసెను . అందరికి 14 సంవత్సరములకు సరిపడా ధనము ,వస్తువులు ఇచ్చెను . రాముడు దానము పుచ్చుకుని సంతృప్తిపడని వారు ఒక్కరు కూడా లేరు . 
అయోధ్యకు సమీపములో పింగళి వర్ణ కేశములు కల ఒక బీద బ్ర్రాహ్మణుడు ఉండెడివాడు . దరిద్రమును తట్టుకొనలేక అతడి భార్య శ్రీ రాముడి వద్దకు వెళ్ళినచో మన జీవనోపాధికి ఏదేని మార్గము దొరుకునని చెప్పగా ఆమె మాటలు విని ఆ బీద బ్ర్రాహ్మణుడు రాముని వద్దకు వెళ్లి తన స్థితిని గూర్చి చెప్పగా శ్రీరాముడు చిన్నగా నవ్వి "ఓ విప్రోత్తమా !నీకు వేయి గోవులు ఇచ్చినను తక్కువే . కావున నీ చేతి కఱ్ఱను బలముగా విసురుము . ఎంత దూరము విసరగలవో అంత గోవుల సమూహమును ఇచ్చెదను "అని పలికెను అంత ఆ బీద బ్రాహ్మణుడు కండువా నడుముకి బిగించి కట్టి తన శక్తి కొలది కర్రను దూరముగా విసరగా అది సరయూ నది దాటి ఆవలి వడ్డుకు వెళ్లెను . రాముడు ఆ ప్రమాణము కల గోవుల సమూహమును గోపాలురను ఆ బీద బ్రాహ్మణుడికి ఇంటికి పంపి "ఓ బ్రాహ్మణోత్తమా !మీకు ఇంకేమన్నా కావలిసిన యెడల మొహమాట పడకుండా అడుగుమనిన ఆ బ్ర్రాహ్మణుడు రాముడు దానగుణమును మెచ్చుకొనెను . శ్రీరాముడిని ఆశీర్వదించెను . 

రామాయణము అయోధ్యకాండ ముప్పదిరెండవ సర్గసమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













No comments:

Post a Comment