రామాయణము
అయోధ్యకాండ -ముప్పదియెనిమిదవసర్గ
సీతాదేవి తన పాటి అగు శ్రీరాముని సమక్షంలోనే నిస్సహాయురాలిలా నారచీరలు ధరించుట చూసిన అక్కడి వారంతా దశరధుని ఛీ కొట్టుచూ ఈసడించిరి . వాటిని విన్న దశరధుని రాజ్యము మీద ,కీర్తిప్రతిష్టల మీద ,చివరకు జీవితమూ మీదనే విరక్తి కలిగెను . అతడు కైకేయి తో "ఓ కైకేయి !ఈ జానకి జనకమహారాజు ముద్దుల కుమార్తె ,మిక్కిలి సుకుమారి ,పతివ్రత ఈమె వల్కలములు ధరించుట యుక్తము కాదు . ఆమె నీకు చేసిన అపకారము ఏమి ?ఆమె చక్కని వస్త్రములతో ఆభరణములతో వనములకు వెళ్తుంది . "అని పలికెను .
ఆ విధముగా పలుకుతూ దశరధుడు క్రింద పడిపోయి మిక్కిలి దుఃఖిస్తూ ఉండెను . అప్పుడు శ్రీరాముడు "తండ్రి నేను వనములకు బయలుదేరుతున్నాను . నా తల్లి కౌశల్య పతివ్రత,వృద్ధురాలు . నా వనవాస దుఃఖంలో మునిగి వున్నది . నేను లేనిచో ఆవిడ తన ప్రాణములనే త్యజించవచ్చును . కావున ఆవిడను జాగ్రత్తగా చూసుకొనుము . నేను లేనని భాద తెలియకుండా జాగ్రత్తగా ,ప్రేమగా చూసుకొనుము . ఈమెను కాపాడేది భారము నీదే "అని పలికెను .
రామాయణము అయోధ్యకాండ ముప్పది ఎనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment