Tuesday 11 April 2017

రామాయణము అరణ్యకాండ -పదునేడవసర్గ

                                         రామాయణము 

                                           అరణ్యకాండ -పదునేడవసర్గ 

ఆ విధముగా సీతారాములు పురాణగాధలతో ,కథలతో ఆ ప్రదేశమునందు హాయిగా ఉండగా ,లక్ష్మణుడు జాగరూకుడై వారికి సేవలు చేయుచుఉండెను . 


అట్లు శ్రీరాముడు సుఖాసీనుడై పురాణగాథాప్రసంగములో మునిగి యుండగా విధివశమున శూర్పణఖ అను ఒకానొక రాక్షసి అచటికి వచ్చి ,శ్రీరాముని రూపలావణ్యములను చూసి ,ఆయనను మోహించి ఆయన వద్దకు వచ్చి "నీవెవరు ?ఇచట భార్యా సమేతుడవై ఎందులకు వసించుచున్నావు ?"అని అడిగెను . 
అప్పుడు రాముడు "దశరధుడను మహారాజు కుమారుడను . మా తండ్రి గారి కోరిక పై వనవాసమునకు వచ్చితిని . నీవెవరు ?ఎవ్వరికి చెందినదానవు ?"అని శూర్పణఖను ప్రశ్నించెను . అప్పుడు శూర్పణఖ "నా పేరు శూర్పణఖ ,నేను దశకంఠుడి చెల్లెలను . అతడు మహా బలశాలి ,పరాక్రమవంతుడు . ఎల్లప్పుడూ నిద్రించు స్వభావము కల కుంభకర్ణుడు నా సోదరుడే ,విభీషణుడు నా సోదరుడే . రణరంగమున తిరుగులేని ఖరదూషణాదులు కూడా నా సోదరులే . నేను కామరూపురాలిని  నీయెడ మోహపరవశురాలినయ్యిని . కావున నన్ను వివాహమాడుము . ఈమె నీ భార్యగా ఏమాత్రము తగదు . మనకు అడ్డుగా వున్న ఈ మానవకాంతని ,నీ సోదరుడిని నేను తినివేస్తాను "అని పలికెను . 
మత్తిల్లిన రాక్షసి అయిన శూర్పణఖ మాటలకు శ్రీరాముడు ఎగతాళిగా నవ్వుతూ ఇలా మాట్లాడసాగెను . 

రామాయణము అరణ్యకాండ పదునేడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment