రామాయణము
అరణ్యకాండ -పదునైదవసర్గ
సీతారామలక్ష్మణులు పంచవటికి చేరిరి . ఆ ప్రదేశమంతా సర్పములు ,మృగములతో ,నిండి ఉండెను . చక్కగా పుష్పించిన వృక్షములతో కాదు రమ్యముగా వున్నది .
శ్రీరాముడు లక్ష్మణునితో "నాయనా !లక్ష్మణా !అగస్త్యమహాముని చెప్పిన పంచవటి కి చేరుకున్నాము . నీవు ,నేను ,మీ వదిన చక్కగా మసలుటకు అనువుగా ఉన్న ,పక్కనే జలాశలయము ఉండవలెను . చుట్టూ పూలవృక్షములతో ఉండవలెను . అగ్నికార్యాది నిత్యవిధులకు లోటురాకుండా సమిధలు ,పూలు ,దర్భలు ,జలములు చేరువులో ఉండునట్లు ఉండవలెను . "అని పలికెను .
లక్ష్మణుడు "అన్నా !నేను నీ సేవకుడను అటువంటి ప్రదేశము ఎక్కడుందో సెలవివ్వుము . "అని పలికెను . పిమ్మట శ్రీరాముడు అటువంటి ప్రదేశము ను లక్ష్మణునికి చూపెను . లక్ష్మణుడు ఆ ప్రదేశములో మట్టితో ,వెదురు ,జమ్మి సహాయముతో చక్కటి ,అందమైన ,దృఢమైన పర్ణశాలను నిర్మించెను .
పిమ్మట ఆ పర్ణశాలను తన అన్నా వదినలకు చూపెను . ఆ పర్ణశాలను చూసిన శ్రీరాముడు సంతోషముతో లక్ష్మణుని కౌగిలించుకొనెను .
సీతాలక్ష్మణులు సేవచేయుచుండగా ,శ్రీరాముడు స్వర్గలోకమున దేవేంద్రుడు వలె హాయిగా జీవించెను . ఇట్లు కొంత కాలము గడిచెను .
రామాయణము అరణ్యకాండ పదునైదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment