రామాయణము
అరణ్యకాండ -తొమ్మిదవసర్గ
సీతారామలక్ష్మణులు సుతీక్షణ మహర్షి ఆశ్రమము నుండి ముందుకు నడుస్తూ మునులధర్మము గురించి చర్చించుకుంటూ ,నడవసాగిరి . అప్పుడు సీతాదేవి "ఆర్యాపుత్రా !మునుల ధర్మము వేరు ,ధనుర్భాణములు ధరించి క్షత్రియ ధర్మము నిర్వహించుట వేరు . ఇవి రెండు పరస్పరము విభిన్నములు . ధనుర్భాణములు ధరించినచో ముని వృత్తి సక్రమముగా అవలంభించలేము .
పూర్వము ఒక మహా ముని పరమ నిష్టాగరిష్ఠుడై ముని ధర్మమును అవలంభించుచు వనములో ఉండెడివాడు . ఒక నాడు ఇంద్రుడు ఆయన కడకు వచ్చి ఒక దివ్యాఖడ్గమును ఇచ్చి ,జాగ్రత్తపరిచి తిరిగి ఇమ్మని మునిని కోరెను . ఆ ముని అందులకు అంగీకరించి ,ఆరోజు నుండి ఆ ఖడ్గమును జాగ్రత్తముగా చూచుకొనుచు ఉండెను . ఆ ఖడ్గమును జాగ్రత్త పరుచుచు ఆయన ద్యాస దాని మీదే పెట్టుటచే ముని వృత్తి నిర్లక్ష్యము చేయసాగెను .
నెమ్మిదిగా ఆ ఖడ్గమును రక్షించు క్రముమున హింసావృత్తి పెరగసాగెను తత్ఫలితముగా ఆయన నరకమునకు వెళ్లెను "కావున మీరు కూడా ఈ ధనుర్భాణములు విడిచి ముని వృత్తిని అవలంభించుట యుక్తమని నా అభిప్రాయము . మీ సోదరుడగు లక్ష్మణునితో బాగుగా యోచించి ఏది మంచిదో అది చేయుము . "అని సీతాదేవి పలికెను .
రామాయణము అరణ్యకాండ తొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment