ఉపవాసం రోజున ఏమి భుజించాలి ?
వారంలో మన ఇష్ట దైవం కు ఇష్టమయిన వారం రోజునో ,లేక ఏకాదశి రోజునో , లేక పర్వదినం రోజునో సాధారణంగా అందరం ఉపవాసాలు చేస్తువుంటాము . అయితే ఇలా ఉపవాసం చేసేటప్పుడు ఎటువంటి పదార్దాలను తినాలి ఎటువంటి పదార్దాలను తినకూడదు అనే సందేహం సాధారణంగా అందరికి వస్తు వుంటుంది .
ఉపవాసం రోజున అన్నం తినకూడదు .' పండ్లు ,నువ్వులు,పాలు ,నీరు,నేయి,పంచగవ్యము,వాయువు'మాత్రమే భుజించాలి . వీటిలో ఒకదానికంటే ఒకటి శ్రేష్టం (గాలిని భుజించడం అన్నిటికన్నా శ్రేష్టం ). పై పదార్దాలు తినవచ్చు అన్నారుకదా అని కడుపునిండా తినకూడదు . మితంగా భుజించాలి .
వ్రత సంభందిత ఉపవాసాలను వైశ్య , శూద్రులు రెండు రాత్రులకంటే ఎక్కువ ఆచరించరాదు . ఇతరులను అనుసరించాలని మూడు లేదా ఐదు రాత్ర్లు చేసినప్పటికీ ఫలితం వుండదు .
స్కాంద పురాణం ప్రకారం స్త్రీలకు భర్త సేవకంటే యజ్ఞం గాని ఉపవాసం కాని వ్రతం కాని లేవు . భర్త ఆచరించే సకల పుణ్య కార్యాలలో పతివ్రత అయిన భార్యకు సగం ఫలితం లభిస్తుంది . భర్త అనుమతి లేకుండా చేసే వ్రతమయినా ,వుపవాసమయినా ఫలితం వుండదు .
వుపవాసానికి కుడా సంకల్పం చెప్పుకోవాలి . ఒక రాగి పాత్ర నిండా నీటిని తీసుకుని , తూర్పు దిక్కుకి తిరిగి నిలబడి తాను ఆ ఉపవాసాన్ని ఏది కోరి ఆచరిస్తున్నాడో సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్ష స్వీకరించాలి .
శశి .
ఎం . ఎ తెలుగు , తెలుగు పండితులు .
No comments:
Post a Comment