రామాయణము
అయోధ్యకాండ -ముప్పదియవసర్గ
శ్రీరాముడు ఎంత ఓదార్చినా సీతాదేవి అందులకు సమ్మతించక తన వనవాసవిషయమై భర్తతో పరుషముగా మాట్లాడేను . అప్పుడు శ్రీరాముడు సీతాదేవి వనవాస పయనమునకు దృఢ నిశ్చయముతో వున్నదని గ్రహించి "ఓ సీతా !నీవు సుకుమారివి కావున వనములో కష్టములు పడలేవని మాత్రమే నిన్ను వలదు అని అంటిని . నీవు లేనిదే స్వర్గము కూడా నాకు రుచించదు . సరే వనవాసము ముందు చేయవలసిన దానాది క్రియలను త్వరత్వరగా ఆచరింపుము .
ఓ సాధ్వీ భాహ్మణోత్తములకు రత్నాభరణాదులను దానము చేయుము . అర్థులై వచ్చిన వారిని అన్నపానాదులతో సంతృప్తులను కావించుము . మన ఇద్దరికీ సంభందించిన మిక్కిలి విలువైన నగలను ,అమూల్యమైన పట్టుపీతాంబరాలు ,వెండి బంగారములతో నిర్మితములైన ,మనోహరములైన ,క్రీడా పరికరములు ,మంచములను ,తల్పములను ,వాహనములు ,ఇంకా ఇతర వస్తువులను బ్ర్రాహ్మణులకు ఇచ్చిన పిమ్మట దాసదాసీ జనములకు ఇచ్చివేయుము . "అని చెప్పేను .
అంత సీతాదేవి రాముడి ఆదేశానుసారం దానములను మొదలుపెట్టేను .
రామాయణము అయోధ్యకాండ ముప్పదియవసర్గ సమాప్తము .
శశి .
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment