Wednesday 29 March 2017

రామాయణము అరణ్యకాండ -ఎనిమిదవసర్గ

                                                 రామాయణము 

                                                   అరణ్యకాండ -ఎనిమిదవసర్గ 

సీతారామలక్ష్మణులు సుతీక్షమహర్షి చే అతిధి సత్కారములు పొంది ఆ రాత్రి అచటనే విశ్రమించి ఉదయమే సుతీక్షణ మహర్షిని తమ ప్రయాణమునకు అనుమతి అడిగెను . ఇంకనూ దండకారణ్యములో కల పెక్కు మునుల ఆశ్రమములను దర్శించవలెనని కోరికగా ఉందని వారు పలికిరి . సీతారామలక్ష్మణులు సుతీక్షణమహర్షి పాదములకు వందనము చేసెను . వారిని లేపి సుతీక్షణమహర్షి 
"శుభలక్షణ రామా !నీకు శుభమగుగాక !నీవు కోరుకున్నట్టే మునుల ఆశ్రమములు దర్శించు . ఈ అడవి రసభరితములైన ఫలములతోను ,పుష్పములతోను ఆహ్లాదభరితముగా ఉండును . నీతోపాటుగా ఈ మునులు కూడా వత్తురు . తిరిగి ఇక్కడకు రా . "అని సుతీక్షణ మహర్షి పలికెను . మహర్షి ఆ విధముగా అనుమతి ఇచ్చిన పిమ్మట సీతాదేవి ధనుస్సు బాణములు ,ఖడ్గములను తెచ్చి రామలక్ష్మణులకు అందించెను . అప్పుడు రామలక్ష్మణులు సీతా ,మునుల సమేతులై దండకారణ్యములో ముందుకు సాగనారంభించిరి . 

రామాయణము అరణ్యకాండ ఎనిమిదవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


No comments:

Post a Comment