పుత్ర గణపతి వ్రతం
ఫాల్గుణ మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమని భాగవతం చేభుతోంది . ఫాల్గుణ శుక్ల పాడ్యమి మొదలుకుని 12 దినాలు పయో వ్రతం (విష్ణు మూర్తికి పాలను నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించే వ్రతం )అదితీ దేవి ఈ వ్రతాన్ని ఆచరించి వామనుడిని పుత్రుడిగా కన్నది . ఈ మాసం లో గోదానం ,ధాన్య దానం ,వస్త్ర దానం చేయడం ద్వారా శ్రీ మహా విష్ణువు ప్రీతికి పాత్రులం కాగలమని ధర్మ శాస్త్ర వచనం .
పౌర్ణమి తరువాత వచ్చు చవితి నాడు గణపతిని దీక్షగా ఆరాధించిన వారికి పుత్ర ప్రాప్తి కలుగుతుంది ,మరియు సమస్త కష్టాలూ తీరతాయి .
వ్రత ఆచరణ ;
ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ,భక్తి శ్రద్ద లతో గణపతిని పూజించాలి . పూజకు కుసుమాలు (పూలు ),అక్షింతలు ,గరిక ,మారేడు ,చందనాదులు ను వుపయోగించి స్వామిని అర్చించి షోడసోపచార పూజ చేయాలి . గణపతికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు, కుడుములు , వడపప్పు ,బెల్లం,కొబ్బరి,అరిటిపల్లు వంటివి నివేదన చేసి ,వాటిని ప్రసాదం గా స్వీకరించాలి . ఇలా వ్రతం చేసిన వారికి సత్ పుత్రులు జన్మిస్తారు .
పార్వతి పుత్రుడు ,గణనాదుడి అనుగ్రహం సదా బక్తులమీద వుండు గాక .
సరేజనా సుఖినో భవంతు .
శశి ,
ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు .
No comments:
Post a Comment