గాయత్రీ మంత్రం
"ఓంభూ ర్భవస్సువః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ "
వేదాలకు అది దేవత గాయత్రి దేవి .కనుక ఆ తల్లిని వేద గాయత్రి అని కుడా అంటారు . మాత 5ముఖాలను కలిగి వుంటుంది . 10 చేతులను కలిగి వుంటుంది .
గాయత్రి మంత్రం ను ఉదయ, మద్యాహ్న, సాయం సంద్యలలో తప్పకుండా జపించాలి . "న గాయత్రాః పరో మంత్రః "గాయత్రి కంటే ఉత్తమమైన మంత్రం మరొకటి లేదని పెద్దల వాక్కు . గాయత్రీ మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపించాలి . అలా జపించలేని వారు తమ శక్తీ మేర జపించవచ్చు ." గాయంతం త్రాయత ఇతి గాయత్రి "తనను జపించే వారిని తప్పకుండా కాపాడుతుంది గాయత్రీ మాత . గాయత్రీ మంత్రాన్ని ప్రతి రోజు జపించే వారికి ఎటువంటి దోషాలు దరి చేరవు .విఘ్నాలు తొలగిపోతాయి . అనుకున్న పనులన్నీ సక్రమం గా జరుగుతాయి . మనసు చాలా ప్రశాంతం గా వుంటుంది . ముఖం ఒక రకమైన తేజస్సును కలిగివుంటుంది . గాయత్రి మాత తల్లి వంటిది . తల్లి వలే సదా రక్షిస్తూ వుంటుంది .
సర్వే జనా సుఖినో భవంతు .
శశి ,
ఎం . ఎ ,తెలుగు ,తెలుగు పండితులు .
No comments:
Post a Comment