Friday 18 March 2016

దశావతారములు

                   దశావతారములు 




1. మత్స్యావతారము ;
    సోమకాసురుడు అను రాక్షసుడు చతుర్వేదములను అపహరించి సముద్రమున దాక్కోనేను.  అప్పుడు  విష్ణు మూర్తి మత్స్యావతారమున అవతరించి  ఆ రక్కసుడుని సంహరించి వేదములను రక్షించెను . 
2 . కూర్మావతారము ;
దేవతలును ,రాక్షసులు కలసి మంధర పర్వతాన్ని కవ్వముగా ,వాసుకిని తాడుగా చేసి సముద్రమును మదించు సమయములో మంధర పర్వతము  కూలెను . అప్పుడు  దేవతలు విష్ణు మూర్తిని ప్రార్దించగా విష్ణు మూర్తి కూర్మ అవతారమెత్తి మంధర పర్వతము యొక్క  చేరి అది  కూలకుండా చేసెను . 
3. వరాహావతారము ;
  హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చుట్టచుట్టి సముద్రమున ముంచెను . అందరి ప్రార్ధనలు మన్నించి విష్ణుమూర్తి వరాహరూపుడై హిరణ్యాక్షుడిని చంపి భూమిని రక్షించెను . 
4. నృసింహావతారము ;
 హిరణ్యకశిపుడు బ్రహ్మ ను గూర్చి తపస్సు చేసి నరుల చేత కాని,మృగముల చేతకాని ,దేవతల చేత కాని,పగలు కాని,రాత్రి కాని,భూమి మీద కాని, ఆకాశంలో  కాని ,ఇంట కాని,బయట కాని,మరణం లేకుండా వరమును పొందాడు . పిమ్మట అతడు దేవతలను ముల్లోకములను మిక్కిలి భాద పెట్టెను . విష్ణు భక్తుడైన తన పుత్రుని కూడా భాదలు పెట్టుచుండెను . విష్ణువు సర్వాన్తరయామి అని అన్న తన కుమారుడి మాటలకు ఎదురుగా వున్నా స్తంబములో చూపించమని దానిని తన్నెను . హిరణ్యకశిపుడు ని సంహరించుటకై ఆ స్తంభము నుండి వచ్చెను . బ్రహ్మ ఇచ్చిన వరము భాగము కాకుండా సగము నర రూపములో సగము మృగ రూపములో వచ్చి దనుజుడిని ఇంటి గడప మీద కుర్చుని గోళ్ళతో చీల్చి సంహరించెను . 
5 .వామనావతారము 
 బలి చక్రవర్తి ముల్లోకములను ఆక్రమించి పాలించుచుండెను . దేవతల ప్రభావము తగ్గిపోయెను . ఇంద్రుడు తన రాజ్యమును పూగోట్టుకోనేను . దేవతలు మోర పెట్టుకొనగా విష్ణు మూర్తి వామనావతారమును ఎత్తి బాలి చక్రవర్తి కడకు వచ్చెను. బ్ర్రాహ్మన బ్రహ్మచారి అయిన వామనుదుని చుసిన బలి చక్రవర్తి ఎం కావాలో కోరుకో అని అడిగాడు . వామనుడు మూడు అడుగుల నేలను కోరగా రాక్షస గురువు శుక్రాచార్యుడు దానం ఇవ్వద్దని అడ్డుకుంటాడు . బాలి  తో కీతకమై కమండలములో దానం ఇవ్వకుండా అడ్డుపడగా కమండలం నుండి నీరు రాకపోవడంతో  వామనుడు దర్భతో కమండలమును పొడవగా శుక్రుడి కన్ను పోయెను . దానితో శుక్రుడు కమండలం నుండి బయటకు వచ్చేయగా నీరు వచ్చినది . బాలి మూడు అడుగుల నేలను దానం చేసాడు . వామనుడు విశ్వమంతా వ్యాపించి ఒక పాదముతో భుమినంతటిని కప్పెను రెండోవ పాదముతో ఆకాశమును కప్పెను . మూడోవ పాదమునకు చోటు లేకపోయెను తన వచనము తప్పకుండా మూడవ పాదము తన శిరస్సుపై పెట్టమని బాలి శిరస్సు వంచెను . వామనుడు బలిని పాతాళమునకు అనగదొక్కెను . 



మిగిలిన అవతారములు రేపు తెలుకున్దాము . 

                                                                     శశి ,

                                                                ఎం .ఎ తెలుగు,తెలుగు పండితులు . 
















 

No comments:

Post a Comment