దశావతారములు
6. పరశురామావతారము ;
ఈయన రేణుక ,జమదగ్నిల పుత్రుడు . రాక్షసులు దేవతల మీదకు దాడి చేసి వారి నగరమును ద్వంసం చేస్తుండగా దేవతలు శివుడి దగ్గరకు వెళ్లి రక్షించమని ప్రార్దించగా శివుడు పరసురాముడిని పిలిపించి పరశువును ఇచ్చి దానవులను చంపమని చెప్పెను. ఆకారణముగా తన తండ్రిని చంపిన హయహయుడు అను రాజు మీద కోపముతో యావత్ ప్రపంచములోని రాజులందరి మీదకు 21 సార్లు దండయాత్ర చేసి రాజులందరిని చంపివేసెను .
7. రామావతారము ;
ఇప్పటికి మనందరమూ రామరాజ్యము ,అని రాముడు లాంటి భర్త అని ,రాముడిని ఉంటాము . అయోధ్యా నగరాధీసుదు అయిన దశరడుడికి పుత్ర కామేష్టి యాగ ఫలముగా జన్మిస్తాడు . తండ్రి మాట కోసము రాజ్యాన్ని సైతం వదిలి అరణ్యవాసానికి వెళ్ళిన సర్వోత్తముడు రాముడు . అరణ్య వాస సమయములోను ,సీతాన్వేషణ సమయములోను అనేక మంది రాక్షసులను చంపి లోకములో శాంతిని నిలిపెను . ఎన్ని యుగాలు మారినా ఇప్పటికి ఎందరికో ఆదర్శమూర్తి సీతాపతి .
8 . బలరామ ;
రోహిణి వసుదేవుల పుత్రుడు . అనేకమంది రాక్షసులను చమ్పదములొ శ్రీకృష్ణుడికి తన సహాయ సహకారములను అందించెను . ఇతను గదా విద్యా నిపుణుడు . బలమైన దేహము కలవాడు .
9. కృష్ణ ;
దేవకీ వసుదేవుల పుత్రుడు దేవకీ దేవి అష్టమ గర్భం లో జనించెను . కంసుడిని చంపి తల్లి తండ్రుల చేర విడిపించెను . ఎందరో రాక్షసులను సంహరించెను . భక్తి తో పిలిచిన భక్తుల మొరలు వినే దయాముర్తి కృష్ణ పరమాత్ముడు . ద్రౌపది ని నిండు సభలో వస్త్రాపహరణం చేయాలని చూసినా ,అక్కడ వున్నా వారంతా బొమ్మల్లా చూస్తూ నిలబడిని ఆవిడ మోర విని ఆవిడను కాపాడిన కరునాన్థరంగుడు . ఆ ఒక్క సారే కాదు ఎన్నో సార్లు ఆవిడను రక్షించాడు . కురుక్షేత్ర సమయములో అర్జునికి గీతోపదేశము చేసాడు . ఇప్పటికి భాగావత్గీతను దైవ సమానముగా పూజిస్తారు . పారాయణ చేస్తున్నాము . ఇంట్లో భగవత్ గీత వుంటే సకల కార్యాలు దిగ్వుజయముగా నెరవేరుతాయి ఎటువంటి ఆపదలు రావు .
10 కల్కి ;
విష్ణు మూర్తి కలియుగాన్థమున కల్క్యత్మకుడై విష్ణు యశుడను పేరున పుట్టును . అతడు సకల ధర్మములను నిలుపును . అధర్మములను మ్లేచ్చులను సంహరించును
సర్వేజన సుఖినో భవంతు .
శశి ,
ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు .
No comments:
Post a Comment