రామాయణము
బాలకాండ -ఏబది ఆరవసర్గ
ఆ విధముగా వచ్చిన విశ్వామిత్రుడు ,వశిష్టుని మీద ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను . వశిష్ఠుడు ఏమాత్రము కదలక తన బ్రహ్మదండము ఎత్తి నిలబడెను . ఆ బ్రహ్మదండ ప్రభావమున ఆగ్నేయాస్త్రము నామరూపములు లేకుండా పోయెను . అందులకు కోపముతో విశ్వామిత్రుడు వరుసగా వారుణాస్త్రము ,రౌద్రాస్త్రము ,ఐన్ద్రాస్త్రము ,పాశుపతము,ఐషీకాస్త్రము ను ప్రయోగించెను .
ఇవే కాక తాను వారము వల్ల సంపాదించుకున్న సమస్త జీవముల అందు కల అస్త్రములన్నీ ప్రయోగించెను . బ్రహ్మపుత్రుడు అయిన వశిష్ట మహాముని బ్రహ్మ దండము ఆ అస్త్రములన్నిటిని కబళించివేసెను . అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను . బ్రహ్మదండము ఆ బ్రహ్మాస్త్రమును సైతము నిస్తేజమొనర్చెను . ఆసమయములో అక్కడి మునులు ,ఋషులకు వశిష్ట మహర్షి యమధర్మరాజులా ,ఆయన చేతిలోని దండము యమపాశములా కనిపించింది .
అప్పుడు అక్కడి వారందరూ వశిష్ట మహర్షిని శాంతించమని ,ప్రసన్నుడవమ్మని వేడుకొనిరి . అంత వశిష్ఠుడు శాంతించేను . అప్పుడు విశ్వామిత్రుడు తనలో తాను "ఛీ క్షత్రియ బలము కూడా ఒక బలమా !బ్రహ్మ్తేజో బలమే నిజమైనబలము . ఒకేఒక్క బ్రహ్మదండము నేను తపస్సు ద్వారా సంపాదించుకున్న అనేక అస్త్రములను వమ్ముకావించింది . బ్రహ్మత్వము పొందుటకై క్షత్రియ రోషములను వదిలి ,మనసు ,ఇంద్రియములను నిగ్రహించి తీవ్రముగా తపస్సు చేసెదను "అనుకొనెను .