Saturday 20 August 2016

రామాయణము బాలకాండ -నలుబది ఏడవసర్గ

                                రామాయణము 

                      బాలకాండ -నలుబది ఏడవసర్గ           

దితి తన గర్భస్థ శిశువు ముక్కలైనందుకు మిక్కిలి చింతించెను . ఏడు ముక్కలు ఏడుగురు కుమారులుగా మరుత్తులు అనే పేరుతో విఖ్యాతులై దివ్యలోకములో సంచరింతురు . అని ఇంద్రునితో పలికెను . ఇంద్రుడు నివశించి ,దితికి సేవలు చేసిన ప్రదేశము ఇదే అని విశ్వామిత్రుడు రామునికి తాము వున్న స్థానము గురించి చెప్పెను . ఇక్ష్వాకు వంశమునకు చెందిన 'సుమతి 'అను పేరు గల జితేంద్రియుడు అయిన మహారాజు ప్రస్తుతము ఈ విశాల నగరమును    పాలించుచున్నారు . విశాల నగరమును పాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూలపురుషుడు అయిన ఇక్ష్వాకుని అనుగ్రహముచే దీర్గాయుష్మంతులై వర్ధిల్లిరి . వారందరూ మహాత్ములు ,పరాక్రమశాలురు ,పరమ ధార్మికులు అని విశ్వామిత్రుడు చెప్పెను . 
ఆ రాత్రి అక్కడే విశ్రమించాలని నిశ్చయించుకున్నారు . మిగుల పరాక్రమవంతుడు ,మహా యశశ్వి అయినా సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు తెలుసుకుని ,పురోహితులతో ,బంధువులతో కూడి ఎదురేగి స్వాగత సత్కారములు చేసెను . సకల మర్యాదలతో ఆయనను పూజించి ,అంజలి ఘటించి కుశల ప్రశ్నలు అడిగెను . పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇలా పలికెను . 
"ఓ మహాత్మా !నన్ను అనుగ్రహింపదలిచి మీరు మా దేశమునకు దయతో విచ్చేసిరి . నేను ధన్యుడనైతిని . మీ దర్శన భాగ్యము కూడా కలిగెను . ఇక నాయంతటి ధన్యుడు ఎవ్వడుండును ?

రామాయణము బాలకాండ నలుబది ఏడవ సర్గ సమాప్తము . 


                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











No comments:

Post a Comment