Monday 22 August 2016

రామాయణము బాలకాండ -నలుబది ఎనిమిదవ సర్గ

                            రామాయణము 



                               బాలకాండ -నలుబది ఎనిమిదవ సర్గ 

కుశల ప్రశ్నలు అయినా తర్వాత 'సుమతి 'మహారాజు సుకుమారులైన ఈ బాలురు ఎవరు ?అని రామలక్ష్మణులను ఉద్దేశించి విశ్వామిత్ర మహర్షిని అడిగెను . అప్పుడు విశ్వామిత్రుడు వారు దశరధుని పుత్రులని తాటక ,సుభాహాది రాక్షసుల వదలను పూసగుచ్చినట్టు ఆ మహారాజుకి వివరించెను . 'సుమతి మహారాజు ఆ వృత్తాన్తము అంతా విని మిక్కిలి సంతోషించెను . ఆ రోజు అచటనే విశ్రమించి మరునాటి ఉదయమే విశ్వామిత్రుడు ,రామలక్ష్మణులు మిథిలా నగరము వైపుగా తమ ప్రయాణమును కొనసాగించిరి . 
మిధిలకు సమీపములో ఒక సుందరమైన ఆశ్రమమును వారు చూసిరి . అది మిక్కిలి పాతది అయినాను ఎంతో రామణీయముగా వున్నది . అక్కడ ఎవ్వరు లేరు . రాముడు ఇదేమి అని విశ్వామిత్ర మహర్షిని అడుగగా ఆ వృత్తాంతమును మహర్షి ఇలా తెలిపెను . 
"ఓ నరశ్రేష్టా !ఇది మహాత్ముడైన గౌతమముని ఆశ్రమము ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుచు దేవతలా పూజలను సైతము అందుకొంచు ఉండెను . పూర్వకాలమున గౌతమముని ,తన భార్య అహల్యతో కూడి ఈ ఆశ్రమమున నివశించెను . గౌతమముని ఆశ్రమమున లేని సమయము చూసుకుని ఇంద్రుడు గౌతముని వేషము దాల్చి అహల్య వద్దకు వచ్చెను . తన దివ్య దృష్టితో వచ్చినది ఇంద్రుడు అని తెలుసుకుని అహల్య "ఓ సురశ్రేష్టా నేను దాంపత్య జీవితమున సంతుష్టురాలును ఇక్కడి నుండి వెంటనే వెళ్లి నీ ,నీ గౌరవము నిలుపుము ". అని పలికెను . అందుకు ఇంద్రుడు అలాగే అని పలికి గౌతముడు వచ్చునేమో అని భయపడుతూ వెలుపలికి రాగా గౌతముడు వస్తూ ఇంద్రుడిని చూసి కోపముతో విగత వృషణుడవు అయ్యెదవు అని శపించెను . అహల్యను కూడా వేల సంవత్సరములు అన్నపానాదులు లేక వాయు భక్షణముతో తపించుచు ఈ ఆశ్రమముననే పడివుండెదవు అని శపించెను . 
దశరధుని కుమారుడు అయిన శ్రీరాముడి పాదధూళి స్పర్శ తో పవిత్రురాలివి అవుతావు అని చెప్పి ఈ ఆశ్రమము వీడి హిమాలయములలో తపస్సు నిమిత్తమై వెడలెను . 

రామాయణము బాలకాండ నలుబది ఎనిమిదవ సర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                      






















No comments:

Post a Comment