Thursday 11 August 2016

                         రామాయణము 




                           బాలకాండ -నలుబది రెండవ సర్గ 

సగరుడు మరణించిన తర్వాత అతని మనవడు అంశుమంతుడు రాజు అయ్యెను . అతని కుమారుడు దిలీపుడు . దిలీపుడిని రాజు చేసి అంశుమంతుడు గంగావతరణం కోసం హిమాలయాలకు వెళ్లి చాలా ఏళ్ళు తపస్సు చేసి తపస్సు ఫలించకుండానే మరణించెను . దిలీపుడు జరిగిన వృత్తాoతము తెలుసుకుని చాలా బాధపడెను గంగావతారణకు ఏమి చేయాలనీ దీర్ఘముగా ఆలోచించి ఏ నిర్ణయము తీసుకోకుండానే ఉండెను . అతని కుమారుడు భగీరధుడు . మిక్కిలి ధార్మికుడు . తన తండ్రి దిలీపుడు ఎన్నో యజ్ఞ యాగములను చేసి ఆ పుణ్య ఫలమున బాధ్యతలు కుమారుడికి అప్పగించి స్వర్గస్థుడయ్యెను . భగీరధునికి పుత్రులు లేరు అతడు తన గంగను భువిపైన అవతరింప చేయుటకు తపస్సు చేయుటకు రాజ్య భారమును మంత్రులకు అప్పగించి హిమాలయములకు వెళ్లెను . 
దీర్ఘ కాలము తపస్సు చేసి బ్రహ్మ దేవుడిని ప్రసన్నుడిని చేసుకుని ,తన ముత్తాతలకు ఉత్తమ గతులు కల్పించటానికి గంగను అవతరింప చేయమని ,ఇక్ష్వాకు వంశమునకు సంతానమును ప్రసాదింపమని రెండు వారములు కోరెను . ఆ వర ప్రభావంవలన గంగ హిమాలయములో ఉద్భవించినది . హిమవంతుని పెద్ద కుమార్తె ఆయిన గంగ ప్రవాహము యొక్క వేగ దాటికి ఈ భూలోకము తట్టుకోలేడు . గంగను ధరించ ఈశ్వరుడే సమర్ధుడు కావున అతని గూర్చి తపస్సు చేయమని బ్రహ్మ దేవుడు చెప్పి అంతర్ధానమయ్యెను . 

రామాయణము బాలకాండ నలుబదిరెండవ సర్గ సమాప్తము . 


                         శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment