రామాయణము
బాలకాండ -నలుబది నాల్గవసర్గ
ఆ విధముగా గంగ భస్మరాసులపై ప్రవహించి వారిని పునీతులను చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై "భూమిమీద సాగర జలములు ఉన్నంతకాలము సగరపుత్రులు దేవతల వలె స్వర్గమున వుంటారు . ఈ గంగ నీకు పెద్దకూతురు ఈమెను ఇకనుండి భగీరధి అని పిలిచెదరు . ఈమె మూడులోకములలో ప్రవహించుట వలన ఈమె త్రిపద గా వాసిగాంచును . నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నావు . ముల్లోకములలో తిరుగులేని యశస్సును సంపాదించావు . శిరోమణీ పవిత్ర గంగా జలములో స్నానమాచరించి పునీతుడవు కమ్ము . నీ పితృదేవతలకు తర్పణములు వదులుము . "అని చెప్పి అంతర్ధానమయ్యెను .
అంతట భగీరధుడు బ్రహ్మ చెప్పినట్లు తర్పణములు వదిలి శుచియై తన నగరమునకు వచ్చి సర్వ సంపదలతో తులతూగుచూ తన రాజ్యమును పాలించెను . ఆ రాజ్యములో ప్రజలందరూ శోక సంతాపములు లేక ఆరోగ్య భాగ్యములతో హాయిగా ఉండెను .
ఓ రామా !గంగావతార వృత్తాన్తము నీకు వివరించితిని . నీకు శుభమగుగాక బ్రాహ్మణులు ,క్షత్రియులు మొదలగు వారందరికీ ఈ పవిత్ర గాద వివరించినచో వారి జీవితములు ధన్యమగును . వారికి యశస్సు ప్రాప్తించును . ఆయువు పెరుగును . పుత్రులు కలుగును . స్వర్గము ప్రాప్తించును .పితృదేవతలు ,దేవతలు వారియెడ ప్రసన్నులగుదురు . శుభకరమైన ఈ గంగావతారనమును భక్తి వారికి కోరికలు అన్నీ తీరును . ,వారి పాపములు అన్నీ నశించును . ఆయువు వృద్ధి చెందును . కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును . అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పెను .
No comments:
Post a Comment