Monday 8 August 2016

                        రామాయణము 



                      బాలకాండ -నలుబది ఒకటవ సర్గ 

సగర మహారాజు తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి తన మనవడు అంశుమంతుని పిలిచి" నీ పినతండులు ఏమయినారో తెలియకుండా వుంది . నీవు శక్తీ మంతుడవు . సమర్థుడవు కావున నీవు వెళ్లి మీ పినతండ్రుల జాడ కనుగొని యాగాశ్వము జాడ కనుగొని దానిని బంధించిన వాడిని చంపి  రమ్ము "అని అతడిని పంపెను . 
తాతగారి ఆజ్ఞను పొంది అంశుమంతుడు ఖడ్గము  ధనుర్భాణములు ధరించి తన పినతండ్రులు భూమిని త్రవ్విన దారిలో వెళ్లి దిగ్గజాలకు నమస్కరించి ,వాటిని ఆచూకీ అడిగి భస్మరాశి వద్దకు చేరిరి . వారి మరణ వార్త విని దుఃఖితుడై ఏడవసాగెను . ఆ అంశుమంతుడు అచటనే సంచరిస్తున్న యాగాశ్వమును చూసేను . అతడు తన పినతండ్రులకు తర్పణములు ఇచ్చుటకు జలముకై చూడగా ఎక్కడా దొరకలేదు . తన తండ్రుల మేనమామ అయిన గరుత్మంతుడు కనపడి ధైర్యము చెప్పెను . గంగా జలములో తర్పణములు విడువుము అని పలికెను . ఇంకనూ యాగాశ్వము తీసుకువెళ్లి యజ్ఞమును పూర్తిచేయమని చెప్పెను . 
అతడు ఆవిధముగా యాగాశ్వమును తీసుకువెళ్లి యజ్ఞ దీక్షలో వున్న తాతకు జరిగిన వృత్తాంతము అంతా వివరించెను పుత్రుల మరణ వార్త దుఃఖించి యదావిధిగా యజ్ఞమును పూర్తిచేసెను . తన నగరమునకు వెళ్లెను . గంగను తీసుకువచ్చే విషయము గురించి ఒక నిర్ణయమునకు రాలేకపోయెను ఇలా చాలా కాలము గడిచెను . ఏ నిర్ణయము తీసుకోకుండానే ఆయన మరణించెను . 



రామాయణము బాలకాండ నలుబది ఒకటవ సర్గ సమాప్తము . 


                        శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment