Wednesday 24 August 2016

రామాయణము బాలకాండ - ఏబదియవ సర్గ

                          రామాయణము 



                     బాలకాండ - ఏబదియవ సర్గ 

శ్రీరామ లక్ష్మణులతో కలసి విశ్వామిత్రుడు ఈశాన్య దిశగా ప్రయాణించి జనక మహారాజు యజ్ఞ వేదికకు చేరుకొనిరి . అక్కడ అనేకమంది మునులతో ,ఋషులతో వేదపండితులతో నిండుగా ఉండెను . జలసమృద్ది కల ఒక ప్రశాంత నిర్జన ప్రదేశమును తమ బసగా రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ఏర్పాటు చేసుకుని ,విశ్రమించారు . 
విశ్వామిత్ర మహర్షి రాక గురించి తెలుసుకున్న జనక మహారాజు స్వయముగా వారి వద్దకు వచ్చి అతిధి మర్యాదలు చేసి ,కుశల ప్రశ్నలు వేసెను . విశ్వామిత్ర మహర్షి కూడా జనక మహారాజుని కుశల ప్రశ్నలు అడిగి అక్కడ జరుగుతున్నా యాగము గురించి ప్రశ్నించెను . దానికి జనక మహారాజు ఆ యాగ వృత్తాన్తము అంతా చెప్పి తమరు వచ్చుట వలన ఈ యాగముకు సాఫల్యము చేకూరిందని పలికి ,మరొక్క పన్నెండు దినములలో ఈ యాగము పరిసమాప్తి అవుతుందని చెప్పెను . ఇంకా హవిర్భాగములు శ్వీకరించుటకు వచ్చే దేవతలను తమరు చూడవచ్చని పలికెను . 
జనక మహారాజు రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రునితో వారి గురించి ప్రశ్నించెను . విశ్వామిత్ర మహర్షి వారి గురించి , తాటక వద గురించి ,యాగ సంరక్షణ గురించి ,అహల్యా శాప విమోచనం గురించి సమస్తము జనక మహారాజుకు వివరించి ,ప్రస్తుతము జనక మహారాజు వద్దనున్న శివధనస్సు చూచుటకు వచ్చినారని తెలిపెను . 

    రామాయణము  బాలకాండ ఏబదియవ సర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












No comments:

Post a Comment