రామాయణము
బాలకాండ -ఏబదిరెండవ సర్గ
విశ్వామిత్రుడు గౌతముడి ఆశ్రమముని చూసి ఎంతో సంతోషించెను గౌతముని వద్దకు వెళ్లి ఆయనకు ప్రణామము చేసెను . మహిమాన్వితుడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారములు చేసెను . అతిధి పూజలు చేసెను . ఒకరినొకరు కుశల ప్రశ్నలు కావించుకొనిరి . వారు చక్కని కదా ప్రసంగములతో చాలా సమయము గడిపిరి . పిమ్మట వశిష్ట మహర్షి "ఓ రాజా ! నీ చతురంగ బలమునకు ,నీకు ఆతిధ్యము ఇవ్వదలిచితిని . దయతో నన్ను అనుగ్రహింపుము . "అని కోరెను .
విశ్వామిత్రుడు "మీ ప్రియా వచనములు మాకు సంతృప్తి కూర్చినవి అవే మాకు సత్కారములు . నీకు నా నమస్కారములు నాయెడ మిత్ర భావము చూపుము . వెళ్ళుటకు నాకు అనుజ్ఞను ఇమ్ము "అని కోరెను . దానికి వశిష్ఠుడు అంగీరింపక పదే పదే ఆదిత్యము స్వీకరించమని కోరెను . అప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించెను .
విశ్వామిత్రుడు అంగీరింపగా వశిష్ఠుడు సంతోషముతో పలు వన్నెలు కల కామధేనువుని పిలిచెను . "చిత్ర విచిత్ర వర్ణముకల ఓ కామధేను ! నా మాట విని సైన్యముతో ,అపరివారముతో కూడి మన ఆశ్రమమునకు వచ్చిన ఈ మహారాజుకి నేను ఆతిధ్యమివ్వదలిచాను . కావున వారందరకీ ఇష్టమైన వంటకములను ,పిండివంటలను ,ఇంకనూ రకరకాల రసములు మొదలగు సమస్త పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము . "అని పలికెను .
No comments:
Post a Comment