Monday 30 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదితొమ్మిదవసర్గ

                               రామాయణము 

                                 యుద్ధకాండ -అరువదితొమ్మిదవసర్గ 

కుంభకర్ణుడి మరణముతో విలపించుచున్న రావణుని అతడి పుత్రుడైన త్రిశరుడు అనువాడు ఓదార్చి ,యుద్ధమునకు బయలుదేరెను . అతడి యుద్ధమునకు బయలుదేరుట చూసిన దేవాంతకుడు ,నరాంతకుడు ,అతికాయుడు అను పేర్లు కల రావణుని కుమారులు కూడా సమరోత్సాహముతో యుద్ధమునకు బయలుదేరి ,రావణుని కి నమస్కారము చేసి ,ప్రదక్షణ చేసెను . అప్పుడు రావణుడు తన కుమారులకు తోడుగా ,మహాపార్శ్వుడు ,మహోదరుడు అను తన సోదరులను యుద్ధమునకు వారితో పాటుగా పంపెను . 
వారెందరో ఎంతో ఉత్సాహముతో యుద్ధ భూమిలోకి అడుగుపెట్టిరి . అక్కడి వానరులతో యుద్ధమును ఆరంభించిరి . వానరులు తన గోళ్ళతో ,పళ్లతో రాక్షసులను గాయపరిచి హింసించసాగిరి . యుద్ధము ఉదృతముగా సాగెను. అప్పుడు నరాంతకుడు సుగ్రీవుడి సైన్యము వైపుగా యుద్ధము చేస్తూ సాగెను . దారిలో కనిపించిన అనేక వానరులను చంపసాగెను . దానితో వానరులు బయపడి పారిపోసాగిరి . అది చూసిన సుగ్రీవుడు ,అంగదుని నరాంతకుడితో యుద్ధమునకు పంపెను . వారిరువురి మధ్య జరిగిన యుద్దములో అంగదుని చేతిలో నరాంతకుడు మరణించెను . 

రామాయణము యుద్ధకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment