Saturday 7 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదియేడవసర్గ

                                రామాయణము 

                                యుద్ధకాండ -ఏబదియేడవసర్గ 

హనుమంతుడి చేతిలో అకంపనుడు మరణించాడని తెలుసుకున్న రావణుడు మిక్కిలి కోపోద్రిక్తుడయ్యెను . పిదప అతడు ముఖమును చిన్నబుచ్చుకుని ,తన మంత్రులతో బాగుగా అలోచించి ,ప్రహస్తుని యుద్ధమునకు పంపుటకు నిశ్చయించుకుని ప్రహస్తునితో "యుద్దకుశులుడవైన ప్రహస్తా !మన లంకా నగరము భుట్టో శత్రువులు ముట్టడించి వున్నారు . అందువలన నగరము ప్రమాదంలో వున్నది . ఈ స్థితిలో ఈ నగరమును ,నేను ,కుంభకర్ణుడు ,సర్వసైన్యాధిపతివైన నీవు ,ఇంద్రజిత్తు ,నికుంభుడు మాత్రమే రక్షించగలము . ఇంకెవరు  ఇందుకు సమర్థులు కారు . కావున నీవు వెంటనే సమర్థులైన రాక్షససైన్యమును తీసుకుని యుద్ధమునకు వెళ్లుము . చపలచిత్తులైన ఆ వానరులు నీ యుద్ధ దాటికి తట్టుకొనలేక పారిపోవుదురు . వానరులంతా పారిపోవుటచే రామలక్ష్మణులు నీకు దాసోహమవుదురు . "అని పలికెను . 
ఆ మాటలు విన్న ప్రహస్తుడు "మహారాజా !ఈ విషయముల గురించే మనము ఇదివరకే మంత్రులతో చర్చించి ఉంటిమి . అప్పుడు అభిప్రాయబేధములు ఏర్పడినవి . 'సీతాదేవిని రామునికి అప్పగించుటే మంచిది లేనిచో అనర్ధము తప్పదు 'అని అప్పుడే నేను చెప్పాను కానీ నీవు నా మాట వినలేదు . ఆ ఫలితమును ఇప్పుడు మనము చూస్తున్నాము . సరే ఏదేమయినా నీవు నన్ను ఇన్నాళ్లు చక్కగా గౌరవంగా ఏ లోటు లేకుండా చక్కగా చూసుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ కోసము యుద్ధమునకు వెళ్తాను నా  అర్పిస్తాను . "అని పలికి సైన్యమునకు ఆజ్ఞ ఇచ్చి సైన్యముతోడి యుద్ధరంగమునకు పరమ ఉత్సాహముతో బయలుదేరెను . దారిలో ప్రహస్తుడికి అనేక పాసకుణములు కనిపించెను . ఆ అపశకునములకు ప్రహస్తుడి ముఖము వాడిపోయెను . అయినను తూర్పుద్వారముద్వారా యుద్ధమునకు వెళ్లెను . రాక్షస సైన్యమును చూసిన వానరులు వారితో యుద్ధము చేయుటకు చెట్లను ,కొండరాళ్ళను తెచ్చుకొనెను . 

రామాయణము యుద్ధకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment