Sunday 15 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదిమూడవసర్గ

                                    రామాయణము 

                                  యుద్ధకాండ -అరువదిమూడవసర్గ 

కుంభకర్ణుడు రావణుడి మాటలు విని పెద్దగా నవ్వుచు ,"మహారాజా !మనము ఇదివరలో ఈ విషయము గురించి చర్చించి ఉంటిమి . నీ హితవు కోరి కొన్ని మంచి మాటలు చెప్పితిమి . కానీ మా మాటలు నీవు పెడచెవిన పెడితివి . ఇప్పటికైనా నా మాటలు వినుము . సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుము . అదే నీకు నిన్ను నమ్ముకుని వున్న వారికి ఈ లంకా నగరమునకు మంచిది . "అని పలికెను . 
ఆ మాటలు విన్న రావణుడు "కుంభకర్ణా !నేను నీకంటే పెద్దవాడను . పైగా ఈ దేశపు రాజుని అయినా నన్ను ఇలా శాసించుచున్నావేమి ?అనవసర విషయములు వదిలి ఇప్పుడు చేయవలసిన పనిని ఆలోచించుము . నీకు నిజముగా నాపై ఆదరాభిమానములు వున్నచో యుద్ధరంగములో పరాక్రమించుము . చిక్కులలో పడిన వాడికి గట్టిగా చేయూతనిచ్చి ,గట్టెక్కించేవాడే నిజమైన ఆప్తబంధువు . "అని పలికెను . 
రావణుడి మాటలు విన్న కుంభకర్ణుడు తన అన్న రావణుడు కోపముగా వున్నాడని గ్రహించి అతడితో "అన్నా !నీ మేలు కోరి మంచి మాటలు చెప్పాను . నేను ఉండగా నీవు శత్రువుల గురించి బయపడవలిసిన అవసరము లేదు . నీకోసము నేను ఇప్పుడు యుద్ధమునకు వెళ్లెదను నీకు ప్రశాంతత లేకుండా చేసిన ఆ రాముడిని లక్ష్మణుడిని ,వానరారాజు సుగ్రీవుడిని ,మన లంకలో ప్రవేశించి లంకా దహనము చేసిన హనుమను ,మృత్యు ముఖమునకు పంపెదను . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment