రామాయణము
యుద్ధకాండ -డెబ్బదియవసర్గ
నరాంతకుడు అంగదుని చేతిలో మరణించుట చూసిన దేవాంతకుడు ,త్రిశరుడు ,మహోదరుడు అంగదుని మీదకు దాడికి వెళ్లి ఒక్కసారిగా అంగదునితో యుద్ధమునకు దిగెను . అది చూసిన హనుమంతుడు నీలుడు అంగదునికి తోడుగా అచటికి వెళ్లిరి . వారందరి మధ్య యుద్ధము ఉదృతముగా సాగెను . హనుమంతుడి ముష్టి ఘాతములకు దేవాంతకుడు అసువులు కోల్పోయి నేలపై పడిపోయెను .
నీలుడి చేతిలో మహోదరుడి తలపై బలముగా కొట్టగా అతడు అక్కడికక్కడే మరణించెను . హనుమంతుడి చేతిలో త్రిశరుడు మరణించెను . పిమ్మట మహాపార్శ్వుడు ఋషభుడి చేతిలో మరణించెను . రాక్షస వీరులు వీరందరూ మరణించుట చూసి భయముతో తమ చేతిలోని ఆయుధములను పారవేసి ,పారిపోసాగిరి .
రామాయణము యుద్ధకాండ డెబ్బదియవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment