రామాయణము
యుద్ధకాండ -ఏబదిఆరవసర్గ
యుద్ధరంగమున కుముదుడు ,నలుడు ,మైందుడు ,ద్వివిదుడు అను వానర వీరులు వీర విహారం చేస్తూ రాక్షసులను హతమార్చుట చూసిన అకంపనుడు కోపముతో యుద్ధరంగము మధ్యలోకి వచ్చి తన బాణ పరంపరతో వానరులను చంపుట మొదలుపెట్టేను . వానరవీరులందరూ ఆ బాణముల దాటికి తట్టుకొనలేక ,యుద్ధరంగముననుండి పారిపోవుట మొదలుపెట్టిరి .
అప్పుడే అక్కడకు వచ్చిన హనుమ ను చూసిన వానరవీరులందరూ పరుగు ఆపి ,ధైర్యము తెచ్చుకుని ,హనుమ చుట్టూ చేరిరి . హనుమ వారికి ధైర్యము చెప్పి యుద్ధరంగములోకి వచ్చెను . హనుమను చూసిన అకంపనుడు హనుమపై బాణముల వర్షము కురిపించేను . అకంపనుడిని చంపవలెనని నిశ్చయించుకున్న హనుమ ఆ బాణములను తన శరీరంలోకి ప్రవేశించి బాధిస్తున్నాలెక్కచేయక ,తన చేతిలో ఏ ఆయుధము లేకపోవుటచే దూరముగా వున్న ఒక పర్వతమును పీకి దానిని గుండ్రముగా త్రిప్పుతూ పరుగున యుద్ధరంగములోకి వచ్చి దానిని అకంపనుడి మీదకు విసిరెను . . అది చూసిన హనుమ తన మీదకు వస్తున్నా ఆ పర్వతమును తన వాడి బాణములతో ధ్వంసము చేసెను . అది చూసిన హనుమ ఒక పెద్ద నల్లమద్దిచెట్టుని పీకి దానిని అకంపనుడి మీద ప్రయోగించుటకు తెస్తూ దారిలో కనిపించిన రాక్షసులను ఆ చెట్టుతో హతమారుస్తూ అకంపనుడి వైపుగా రాసాగేను . అది చూసిన అకంపనుడు హనుమ పైకి అనేక బాణములు ప్రయోగించేను . హనుమ శరీరమంతా ఆ బాణముల దాటికి రక్తసిత్తమయ్యెను . హనుమ ఏమాత్రము లెక్కచేయక , వృక్తమును పీకి దానితో అకంపనుడి శిరస్సున కొట్టెను . ఆ దెబ్బకు అకంపనుడు అక్కడికక్కడే మరణించెను .
అకంపనుడు మరణించుట చూసిన రాక్షసులు భయముతో పారిపోవుట మొదలుపెట్టిరి . వానరవీరులు సంతోషముతో హనుమ చుట్టూ చేరి జయజయ ద్వానములు చేసిరి . వానరవీరులంతా సంతోషపడిరి . సుగ్రీవుడు మొదలగు వానరవీరులు రామలక్ష్మణులు ,జాంబవంతుడు ,విభీషణుడు హనుమ పరాక్రమమును పొగిడిరి .
రామాయణము యుద్ధకాండ ఏబదిఆరవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment