Wednesday 27 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది ఐదవ సర్గ

                                 రామాయణము 


                                     బాలకాండ -ముప్పది ఐదవ సర్గ 

విశ్వామిత్రుడు మహర్షులతోను ,రామలక్ష్మణులతోను కలసి ఆ రాత్రి అక్కడే గడిపిరి . తెల్లవారి లేచి ప్రయాణమునకు ఉపక్రమించెను . శోణ నది ఇసుక తిన్నెలతో నావ ప్రయాణమునకు అనువుగా లేకుండెను . ప్రయాణ మార్గములను బాగా ఎరిగిన విశ్వామిత్రుడు చూపిన దారిన మునులు ,రామలక్ష్మణులు అనుసరించెను . చాలా దూరం నడిచిన పిమ్మట గంగా తీరమునకు చేరిరి . అక్కడ విశ్రమించిరి . ఆ సమయములో శ్రీరాముడు విశ్వామిత్రుడిని ఇలా అడిగెను . 
"ఓ మహానుభావా !స్వర్గ ,మర్త్య ,పాతాళ లోకములలో ప్రవహించు గంగా వృత్తాoతమును దయతో తెలుపుము "అని కోరగా ,విశ్వామిత్రుడు ఇలా తెలిపెను . 
"ఓ రామా !హిమాలయము అను ఒక మహా పర్వతము కలదు . అది గిరులలో శ్రేష్టమైనది ఆ హిమవంతునికి ఇద్దరు కుమార్తెలు . వారిలో పెద్దది గంగ ,రెండవ కుమార్తె ఉమాదేవి . ఒకనాడు దేవతలు లోక ప్రయోజనార్ధమై గంగను తమకు అప్పగింపమని హిమవంతుని కోరారు . అంతట ధర్మాత్ముడైన హిమవంతుడు తన కూతురు గంగను ముల్లోకములు హితము కొరకై వారికి అప్పగించెను . ఆ విధముగా గంగాదేవి ఆకాశమునకు చేరింది . 
హిమవంతుని రెండవ కుమార్తె పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి ఆయన భార్య అయ్యెను . ఈ విధముగా హిమవంతుని ఇద్దరు పుత్రికలు లోక పూజ్యులు అయ్యిరి . 

రామాయణము  బాలకాండ ముప్పది ఐదవ సర్గ సమాప్తము . 



                      శశి ,

ఎం . ఏ ( తెలుగు ),తెలుగు పండితులు . 




                                   

                          









































No comments:

Post a Comment