Saturday 30 July 2016

రామాయణము బాలకాండ -ముప్పది ఎనిమిదవ సర్గ

                                 రామాయణము 

                                 బాలకాండ -ముప్పది ఎనిమిదవ సర్గ 

విశ్వామిత్రుడు ఇంకనూ ఇలా చెప్పెను . పూర్వము" సగరుడు "అనే మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను . అతడు మహా వీరుడు ,ధర్మాత్ముడు ఆయనకు సంతానము లేకపోవుటచే తన ఇద్దరు భార్యలు అయిన 'కేశిని ','సుమతి ' అను వారితో కలిసి హిమవత్పర్వతము మీద  భృగు మహర్షి కొరకు  తపస్సు ఆచరించెను . అంత ఆయనకు తపమునకు మెచ్చిన భృగు మహర్షి "పుణ్యాత్ముడైన ఓ మహారాజా !నీకు అనేకమంది పుత్రులు కలుగుతారు . నీకు ఒక భార్య నందు వంశోద్ధారకుడు అయినా ఒక పుత్రుడు ,మరొక భార్య నందు 60,000 మంది పుత్రులు జన్మిస్తార"ని చెప్పగా ,సగరుని భార్యలు మాలో ఎవరికీ ఒక పుత్రుడు ,ఎవరికీ 60,000 మంది పుత్రులు జన్మిస్తారని అడిగెను . అప్పుడు భృగు మహర్షి మీలో ఎవరికీ వంశోద్ధారకు అయిన ఒక పుత్రుడు కావాలి అని అడిగెను . అప్పుడు సగర మహారాజు పెద్ద భార్య ,విదర్భ రాజా కుమార్తె అయిన 'కేశిని 'నాకు వంశోద్ధారకుడు ఆయిన ఒక పుత్రుడు కావాలని అడిగెను . సగరుని రెండవ భార్య ,గరుత్మంతుని సోదరి అయిన 'సుమతి 'మహోత్సాహులు ఆయిన పెక్కు మంది కుమారులు కావాలని కోరుకొనెను . 
ఓ రఘు నందనా !అనంతరము సగరమహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదక్షణ ,నమస్కారము చేసి అయోధ్యా పురమునకు వెళ్లెను . కొంత కాలమునకు సగరుని పెద్ద భార్యకు 'అసమంజసుడు 'అనే కుమారుడు కలిగెను . రెండవ భార్య నందు 60,000 మంది పుత్రులు పుట్టిరి వారిని దాదులు నేతి కుండలయందు పెంచిరి . 
ఓ నరోత్తమా !రామా !సగరుని పెద్ద కుమారుడు అయిన అసమంజసుడు నిత్యమూ నగరంలోని బాలురుని తీసుకువెళ్లి సరయు నదిలో పడవేసెను . ఇలా అసమంజసుడు పెక్కు చెడ్డ పనులను చేసెను . మంచి వారిని భాదించెను . పౌరులకు హాని కలిగించెను . అందువలన సగరుడు ఆ కుమారుడిని నగరము నుండి వెళ్లగొట్టెను . 
అసమంజసుని కుమారుడైన 'అంశుమంతుడు 'గొప్ప పరాక్రమమంతుడు . అతడు ప్రజలందరికి ప్రీతీ పాత్రుడు . అందరితో ప్రియముగా మాట్లాడుచుండెను . ఓ నరశ్రేష్టా !కొంత కాలమునకు సగర మహారాజు యజ్ఞము చేయవలెనని సంకల్పించెను . వేదజ్ఞుడైన సగర మహారాజు గురువులతో ,ఋత్విజులతో కూడి యజ్ఞ కార్యమును ఆరంభించెను . 

రామాయణము  బాలకాండ ముప్పది ఎనిమదవ సర్గ సమాప్తము . 


                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
















No comments:

Post a Comment