Thursday 28 February 2019

రామాయణము కిష్కిందకాండ -నలుబదిమూడవసర్గ

                                       రామాయణము 

                                    కిష్కిందకాండ -నలుబదిమూడవసర్గ 

సుగ్రీవుడు సుషేణుడిని పడమర దిక్కుకు వెళ్ళమని ఆజ్ఞాపించిన తదుపరి 'శతవలి ' అను వీరునితో "ఓ మహావీరా !నీవు నీతో సమానమైన వీరులను తీసుకునిఉత్తర దిశకు బయలుదేరుము మ్లేచ్ఛదేశములను ,పుళిందులభూములను ,శూరసేనుల రాజ్యములను బాగా అన్వేషించండి . ఇంద్రప్రస్థము దాని పరిసర ప్రదేశములను ,కురుక్షేత్రాది ప్రాణతములను ,మద్రకదేశములను ,కాంభోరాజ్యములను ,యవనుల భూములను ,సకులదేశములను ,ఆరత్తకదేసభాగములను ,బాహ్లిక రాజ్యమును ,రుషిక ప్రదేశం లను ,పురురాజుల భూములను ,టంకణ దేసప్రాంతములను, చీన ,పరమచీన భూములను ,ఎల్లప్పుడూ మంచుతో నిండి వుండు ప్రదేశమును ,దురద దేశములను ,హిమవత్పర్వత ప్రాంతమును ,దట్టముగా వుండే లడ్డుగచెట్లమధ్యను ,పద్మకవృక్షములలోను ,దేవదారు వనములందును ,రావణుని నివాసము కొరకు సీతాదేవి జాడ కొరకు వెతుకుము . 
దేవతలు ,గంధర్వులు సంచరించునట్టి సోమాశ్రమ ప్రాంతములు వెతకండి . పిమ్మట పెద్ద శిఖరములు కల కాళపర్వతము పూర్తిగా వెతుకుము .అది దాటినా పిమ్మట హేమగర్భము అను పర్వతము వచ్చును . పిమ్మట సుదర్శనం అను పెద్ద కొండా వచ్చును . ఈ రెండింటిని బాగా వెతికిన తర్వాత దేవసఖ అను పర్వతము వచ్చును . అక్కడ కూడా బాగా వెతకండి . ఆ పర్వతము దాటినా పిమ్మట ఎటు చూసిన వంద యోజనముల దూరము శూన్య ప్రదేశమే కనపడును . కావున అక్కడ ఎవరు వుండరు . అది కూడా దాటినా పిమ్మట ఒక భయంకరమైన అడవి వచ్చును . అక్కడ మీకు కైలాస పర్వతము కనిపించును . తెల్లని కాంతులతో విరాజిల్లే ఆ పర్వతమును చూసినంతనే మీకు ఒళ్ళు పులకరించును .

 అక్కడ కుబేరుడి భవనము కలదు . అది పరమ రమణీయము . అక్కడ ఆ చుట్టుపక్కలా జాగ్రత్తగా వెతకండి . 
ఆ పిమ్మట మీరు క్రౌంచ గిరికి వెళ్లుము . అక్కడ ఒక భయమకరమైన గుహ కలదు అది కుమారస్వామి తన ఆయుధము ప్రయోగించినపుడు ఏర్పడిందని ప్రసిద్ధి . అక్కడకు జనులు వెళ్లలేరని ప్రసిద్ధి కావున అక్కడ జాగ్రత్తగా వెతకండి . పిమ్మట మైనాకము అను పర్వతము మీకు కనిపించును . ఆ పర్వతము అనేకులైన దేవతలు కిన్నెరు కింపురుషులు లకు నివాసము కావున అక్కడ జాగరూకులై వెతుకుము . ముందుకు వెళ్లిన పిమ్మట ఒక పవిత్రమైన ఆశ్రమము వచ్చును . ఆ ఆశ్రమములో ఉన్న మునీశ్వరులు ను సీతాదేవి జాడకై ప్రార్ధించండి . అక్కడి నుండి ముందుకు వెళ్లిన పిమ్మట అక్కడ సూర్యచంద్రులు కానీ నక్షత్రములు కానీ కనిపించవు . కానీ అక్కడ వుండే మునులు సిద్దులు స్వయంప్రకాశకులు వారి ప్రకాశము వల్లనే అక్కడ వెలుగు ఉండును . అక్కడ వారిని  ప్రార్ధించి సీతాదేవి జాడ తెలుసుకొనుము . 
ఆ పర్వతము  దాటిన పిమ్మట శైలోదము అను పేరు కల నది వచ్చును .

 ఆ నదీ తీరమున ఉత్తర కురు భూములు కలవు . ఆ దేశమున పెక్కు నదులు కలవు అవి జల సమృద్ధి కలవి . ఆ నదులలో వున్న పర్వతములు బంగారు రంగుతో కాంతులీనుతూ అగ్ని పర్వతము వలె ఉండును . అవి వివిధములగు రత్నములకు నిలయములు .

 ఆ ప్రాంతములన్ని బాగా వెతికిన పిమ్మట సోమగిరి అను పర్వతము వచ్చును . ఆ పర్వతము సువర్ణమయము .ఆ పర్వత అందములను  దేవతలు ఆకాశము నుండి చూచుచుందురు . అక్కడ విష్ణువు ,బ్రహ్మ ,శంకరుడు నివసించుచువుండును . ఈ త్రిమూర్తులను భ్రహ్మర్షులు సేవించుచు ఉందురు . ఎట్టిపరిస్థితులలో మీరు ఉత్తర కురుభూములను దాటరాదు . సోమగిరి అందు ప్రవేశించుటకు ఎవ్వరికి సాధ్యము కాదు. మీరు ఇంతవరకు మాత్రమే వెళ్ళగలరు . ఆపై సూర్యరసమే ఉండదు . కనుక ఆ తర్వాత ఏ దేశములు నేను ఎరుగను  కావున అంతవరకూ వెతికి తిరిగి రండు . మీకు కూడా నెలరోజులు గడువు . సీతాదేవి సమాచారమును తెచ్చినచో శ్రీరాముడు మిక్కిలి సంతోషించెను . ఆయన సంతోషించటం ద్వారా ఆ వార్తా తెచ్చినవారు నాకు మిక్కిలి ప్రేమాస్పదులు అవుతారు . "అని పలికెను . 
రామాయణము కిష్కిందకాండ నలుబదిమూడవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




 

                                   

రామాయణము కిష్కిందకాండ -నలుబది రెండవసర్గ

                                   రామాయణము 

                             కిష్కిందకాండ -నలుబది రెండవసర్గ 

అంగదాది వానరులను దక్షిణ దిశ కు పంపిన పిమ్మట సుగ్రీవుడు తార యొక్క తండ్రి తనకు మామ అయిన సుషేణుడి వద్దకు వెళ్లి నమస్కరించెను ఆయుధ పాటి అగు ఆ సుషేణుడు మిక్కిలి పరాక్రమ శాలి నీల వర్ణము వాడు మిగుల పరాక్రమ శాలి . 
 

                                                                                                                                                                              సుషేణుడి వెనుక మారీచాది మహా వీరులు అనేక మంది ఉండిరి వారందరిని సీతాన్వేషణకు పశ్చిమ దిశకు వెళ్ళవలసినదిగా వారందరిని సుగ్రీవుడు ఆదేశిస్తూ "ఓ వానర ప్రముఖులారా సులహీనుడి నాయకత్వములో మీ రందరు రెండు లక్షలమంది వానర వీరులతో కలిసి సీత దేవి జాడను తెలుసు కొనుటకు వెళ్ళండి ముందుగా సౌరాష్ట్ర ప్రాంతములను బాహ్యక దేశములను, సూరా భీమా ప్రదేశములను ,వేశాలములై మనోహరంగా ఉండే జన పదములను, మహా నగరములను, పున్నాగ వృక్షములతో ,వకుళ వృక్షములతో ఉద్దాలక వృక్షాలు మొగలి పొదలు 
తో కూడిన మధ్య ప్రదేశమును సీతాదేవికి గాలించుము . 
పవిత్రమైన చల్లని జలములతో పశ్చిమ దిశకు ప్రవహించెడి నదీ తీరములలో ,మునీశ్వరులు వుండే వనములలో ,దట్టమైన అడవులలో కొండలపైన సీతాదేవికొరకు వెతకండి . తర్వాత పశ్చిమ దిశలో మరుభూముల వంటి మెత్త నేలలను నిటారుగా వున్న శిలా ప్రాంతములను ,కొండలతో ఆవరించబడి వున్న భయమకరమైన ప్రదేశములను బాగా వెతకండి . ఓ వానరులారా !తర్వాత ఇంకా పడమర దిశగా సాగినచో సముద్రతీరమునకు వెళ్తారు . 
అక్కడి నీళ్లలో తిమింగలములు ,ముసళ్ల ఉంటాయి . ఆ సముద్రజలములు ప్రశాంతముగా ఉంటాయి . ఆ స్లోగర తీరములో కల మొగలి మొదలలో కానుగ తోపులలో ,కొబ్బరితోటలలో మీ వానరులందరూ బాగా వెతకండి . ఆ తీరమునే వున్న పర్వతములలో ,వనములలో రావణుని నివాసము ,సీతాదేవి ఆచూకీ కొరకు బాగా తీవ్రముగా వెతకండి . 
తర్వాత మురచీ పట్టణమును రమ్యమైన జటీ పురమును ,అవంతిని ,ఆంగలోపావారిని ,అలక్షితావనమును ఇంకా విశాలములైన ప్రదేశములు ,పట్టణములు వెతకండి . సిందూ నది సముద్రములో కలిసే ప్రదేశములో హేమ గిరి అను ఒక పర్వతము కలదు . బాగా విశాలమైన ఎక్కువ శిఖరములు కల ఆ పర్వతమును ఆసాంతము జాగ్రత్తగా వెతుకుము . ఆ శిఖరములపై గంధర్వులు నివసిస్తుంటారు . ఆ శిఖరము పై కల ఫలములను ,కందమూలాదులను ఎవ్వరు తినరాదు . అవి గంధర్వులు ఆహారములు . అవి తిన్నచో వారికి కోపము వచ్చును . అది చాలా ప్రమాదకరం . అయినా అక్కడ కూడా సీతా దేవి కొరకు బాగా వెతకండి . అక్కడికి సమీపములో వజ్రగిరి అను ఒక పర్వతము కలదు . అది నూరు యోజనాల దూరము వ్యాపించి వున్నది . ఆ పర్వతముపై గుహలలో ఆ తల్లి కొరకు వెతకండి . 
అక్కడికి సమీపములోనే చక్రవంతము అనే పేరు కల మహా పర్వతము కలదు . అది సముద్రములో నాలుగవ వంతు ఉండును . దానిపై విశ్వకర్మ వేయి అంచులు కల ఒక చక్రమును నిర్మించెను . పురుషోత్తముడైన శ్రీమహా విష్ణువు ఈ పర్వతము లో నివసిస్తున్న పాంచజనుడు ,హయగ్రీవుడు అను దానవులను చంపి వారి నుండి పాంచజన్యము అను శంఖమును ,సుదర్శనం అను సహస్రారచక్రమును తీసుకొని వచ్చెను . చిత్రములైన ఆ పర్వతములో బాగుగా వెతకండి . అక్కడి నుండి అరవై యోజనముల దూరములో అగాధమైన సముద్రములో వరాహగిరి కలదు . ఆ గిరిపై ప్రాగ్జోతిషపురము అనే నగరమును ఏర్పరుచుకుని నరకుడు అనే రాక్షసుడు పరిపాలన సాగిస్తున్నాడు . అక్కడ కూడా బాగా వెతకండి . 
అది దాటినా తర్వాత సర్వసౌవర్ణ పర్వతము వచ్చును . అక్కడ కూడా బాగుగా వెతకండి . ముందుకు వెళ్తే మేఘవంతము అను పర్వతము వచ్చును . అక్కడే ఇంద్రుని దేవతలు పట్టాభిషిక్తుడిని చేశారు . అక్కడి నుండి ముందుకు వెళ్లిన పిమ్మట 60,000 బంగారుకొండలు మీకు కనపడును . వాటి మధ్యలో దేదీప్యమానంగా వెలుగుతున్న మేరుగిరి కనిపించును ఆ ప్రాంతములన్ని జాగ్రత్తగా వెతకండి . అక్కడ 'మేరుసావర్ణి 'అను మహర్షి కలడు . అతడిని సీతాదేవి జాడ కొరకు అభ్యర్ధించండి . ఓ వీరులారా !పశ్చిమ దిక్కున మీరు ఇంతవరకే వెళ్ళగలరు . కావున ఇప్పటివరకు నేను చెప్పిన ప్రదేశము అన్ని జాగ్రత్తగా వెతికి తిరిగి రెండు . మీకు కూడా నెల రోజులే సమయము గడువులోపు రాణి వాడికి నా చేతిలో చావు తప్పదు "అని ఆజ్ఞాపించెను . 
రామాయణము కిష్కింద కాండ నలుబది రెండవసర్గ సమాప్తము . 

శశి ,

 ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Wednesday 27 February 2019

రామాయణము కిష్కిందకాండ -నలుబదిఒకటవసర్గ

                              రామాయణము 

                           కిష్కిందకాండ -నలుబదిఒకటవసర్గ 

సుగ్రీవుడు , వినతుడు మొదలైన వానర వీరులను తూర్పు వైపు పంపిన పిమ్మట అన్ని విధాలుగా నిగ్గు దేలిన వానరులను దక్షిణ దిశకు పంపెను నీలుడు ,హనుమంతుడు జాంబవంతుడు ,సుహోత్రుడు ,శరారీ ,శరగులుముడు ,గజుడు ,గవాక్షుడు ,గవయుడు ,సుషేణుడు ,ఋషభుడు ,మైందుడు ,ద్వివిదుడు ,విజయుడు, గంధమాధనుడు, హుతాశనమతులైన ,ఉల్కాముఖుడు అసంగుడు ,వాలి కుమారుడైన  అంగదుడు మున్నగు వానర వీరులను  మహావీరుడు వానరప్రభువైన సుగ్రీవుడు సీతాన్వేషణకు దక్షిణ దిక్కుకు పంపెను . ఈ వీరులందరికి యువరాజైన అంగదుని నాయకుడిగా నియమించెను . 

"ఓ వానరవీరులారా మీరు సీతాన్వేషణను వింధ్యపర్వతము నుండి ప్రారంభించుము . అక్కడ నుండి నర్మదా నదికి వెళ్లుము అక్కడ విషపూరిత సర్పములు ఉండును కావున జాగ్రత్త . పిదప రమ్యములైన గోదావరి ,కృష్ణవేణి ,వరద ,పెద్దపెద్ద పాములకు నెలవైన మహాభాగ మొదలగు నదీ తీరములను గాలింపుము . మనోహరములైన విదర్భ ,రుషిక ,మాహిషిక వంగ ,కళింగ ,కౌశిక మొదలగు దేశములన్ని బాగా జాగ్రత్తగా వెతుకుము . 
తర్వాత దండకారణ్యము లోని పర్వత ప్రాంతములను ,నదీనదములను ,గుహలను ,గోదావరి నది యొక్క పాయలను చాలా నిశితముగా పరిశీలింపుడు . అలాగే ఆంద్ర ,పుండ్ర ,చోళ ,పాండ్య ,కేరళ మున్నగు దేశములలో సకల భాగములను అనేషించండి . అక్కడకు దగ్గరలో వున్నా మలయా పర్వతమును వదలక వెతకండి . ఆ గిరి శిఖరములు చిత్రవిచిత్రములుగా ఉండును . మహా గిరిపై చందాన వృక్షములు ఎక్కువ . 
అక్కడనుండి ముందుకు వెళ్తే కావేరి నది వచ్చును . అక్కడ అప్సరసలు విహరిస్తుంటారు . ఆ పర్వతము పై నివసించుచున్న అగస్త్యమునిని దర్శించండి . ఆయన అనుమతితో తామ్రపర్ణి నదిని దాటుము . ఆ నదిలో మొసళ్ళు ఉంటాయి జాగ్రత్త . తర్వాత ముత్యములతో అలంకరింపబడిన పాండ్యరాజుల నగరము వచ్చును . అక్కడ కూడా బాగుగా వెతుకుము . అక్కడ నుండి ముందుకు వెళ్తే మీరు సముద్ర తీరమునకు చేరుతారు . ఆ సముద్రములో అగస్త్యుడు మహేంద్రగిరిని ఉంచాడు . ఆ పర్వతము పరమ రమణీయమైన ప్రాంతము . అక్కడ దేవతలు అప్సరసలు ,తిరుగుతుంటారు . అక్కడికి దేవేంద్రుడు పర్వదినములలో సముద్ర స్నానమునకు తప్పక వచ్చును .
అక్కడ నుండి నూరు యోజనాల దూరము వెళ్తే ఒక మహా ద్వీపము వస్తుంది . అక్కడకు ప్రవేశించుట మానవమాత్రులకు అసాధ్యము . అక్కడ కూడా బాగా వెతకాలి . ఆ ప్రదేశము అంతా రాక్షస రాజైన రావణుని అధీనములో ఉండును . ఆ దక్షిణ సముద్రములో అంగారక అను రాక్షసి కలది అది సముద్రము లో వుండి పైన పయనించు వారి నీడలను ఆకర్షించి వారిని భక్షించుతూ ఉండును . అలంకాద్వీపము (సీతాదేవిని అచ్చటనే వుని ఉండవచ్చని వారి ఊహ )లోని ప్రదేశములన్ని నిశితముగా గాలించండి . అక్కడ సీతాదేవి లేదని ఒకటికి రెండు సార్లు నిర్దారించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి . 
ఆ ద్వీపము దాటి ముందుకు వెళ్లిన తదుపరి పుష్పితాము అనే ఒక పర్వతము వస్తుంది . ముందుగా ఆ పర్వతమునకు నమస్కరించి వెతుకుము . అది దాటినా తదుపరి సూర్యవంతము అనే శైలము వచ్చును . దానికి వెళ్లవలిసిన మార్గము అతి కష్టమైనది . అది కూడా దాటినా పిమ్మట వైద్యుతము అను పర్వతము వచ్చును . అక్కడ కల మేలైన కందమూలములు మధువులు తిని త్రాగి సావధానంగా సీతాదేవి కొరకు వెతకండి . కొంచం ముందుకు వెళ్లిన పిమ్మట కుంజరము అను పర్వతము వచ్చును . అక్కడ నుండి ముందుకు సాగిన తర్వాత భోగవతి అను పురము కలదు . విషసర్పములు ఆ నగరమును రక్షిస్తూ ఉంటాయి . 
అది కూడా దాటినా తర్వాత వృషభ పర్వతము వస్తుంది . దానిని దాటినా తర్వాత భూమి సరిహద్దు కనిపించును . అక్కడ స్వర్గమునకు అర్హులైన వారు మాత్రమే నివసించగలరు . అంఎంతరము కనపడునది పితృలోకము అది యమసాధనము అక్కడికి ఎవ్వరు ప్రవేశించలేరు . కనుక మీరు అక్కడకు వెళ్లొద్దు . నేను చెప్పిన ప్రాంతములు అన్ని కూడా చాలా జాగ్రత్తగా వెతికి క్షేమముగా రండి . సీతని చూసాను అని చెప్పేవాడు ,నాతోపాటు సమానముగా భోగములు అనుభవించగలడు ,మిక్కిలి ప్రేమపార్ధుడు ,గౌరవాస్పదుడు . మీకు కూడా నెల రోజులే సమయము ఆ సమయములోపు మీరంతా తిరిగి రావలెను "అని పలికెను 

రామాయణము కిష్కిందకాండ నలుబదిఒకటవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
  








రామాయణము కిష్కిందకాండ -నలుబదియవసర్గ

                            రామాయణము 

                            కిష్కిందకాండ -నలుబదియవసర్గ 

సుగ్రీవుడు శ్రీరామునితో "రామా !కొన్ని వేలకోట్ల వానరవీరులు ఇచటికి వచ్చినారు . వీరందరూ మహా బలశాలురు . ఇక వీరందరూ నీ సేన . నీవు ఎలా చెబితే వారు ఆలా చేస్తారు . యుద్ధము కూడా వేరు సిద్దము . వారి తో పాటు నేను కూడా నీ వెంటే వుంటాను . "అని పలికెను . 
సుగ్రీవుడి మాటలు విని మిక్కిలి సంతృప్తుడైన రాముడు సుగ్రీవుని కౌగలించుకుని "సుగ్రీవా !నాకు లక్ష్మణుని తదుపరి  నీవే ప్రాణప్రదుడవు . నీవంటి స్నేహితుడు ఉన్నట్లయితే మనుష్యులు సాధించలేనిది ఏమి ఉండదు . ముందు మనము సీతాదేవి ప్రాణములతో వున్నదో లేదో తెలుసుకొనవలెను . రావణుని పేరు తప్ప అతడు వుండు ప్రదేశము కానీ అతని శక్తి సామర్ధ్యములు కానీ మనకు తెలియవు . కావున మనము ముందు వాటిని తెలుసుకొనవలెను . ఓ వీరా !సీతాన్వేషణ కార్యమును సాధించు విధానము నీకే బాగుగా తెలియును . ఇందులో సందేహము లేదు . కనుక నీవే తగు విధముగా నిర్ణయించి నీ అనుచరులను ఆజ్ఞాపించుము . "అని పలికెను . 

ఆ మాటలు విన్న సుగ్రీవుడు వెంటనే తన సేనానాయకుడు ఐన వినతుని పిలిపించెను . 

పర్వతము వలె మహాకాయుడు ,మేఘము వలే గర్జించువాడు అయిన వినతుడిని సుగ్రీవుడు రామలక్ష్మణుల సన్నిధిలో ఇలా ఆజ్ఞాపించెను . చురుకైన వేలకొలదిగా కల వానరులను వెంటపెట్టుకుని కొండలు కోణాలు ,అరణ్యములతో కూడిన తూర్పు దిక్కుకు వెళ్లి అచట ఆణువణువూ సీతాదేవి కొరకు రావణుని స్థావరం కొరకు అన్వేషించుము . 
గంగ ,సరయు ,కౌశికి ,యమునా మున్నగు నదులను ,యాము నాగరిని సరస్వతి ,సింధు మణుల వలె స్వచ్ఛమైన జలములు కల ,శోణ ,మహి పర్వతముల నుండి వనముల మధ్యగా పరవహించెడి కాల మహి మున్నగు నాయీ తీరములలో వెతుకుము . 
భ్రహ్మమాల విదేహ ,మాళవ ,కాశి ,కోశాల ,సుగద మొదలగు మహాగ్రామములను పుండ్ర ,అంగదేశముల యందలి జనపదములను ,కోశాకారుల పట్టణములను వెండి గనులు గల   భూములు మున్నగు ప్రదేశములను అన్నిటిని వెతుకుము . 
సముద్రములో గల పర్వతములను వాటి మధ్య కల ద్వీపముల అందలి నగరములను మందరాచల శిఖరము మీద కల గ్రామాలలో నివశించుచున్న జనులను విచారింపుడు . వారిలో కొందరు వంశాభివృద్ధి కలవారు ,కొందరు బలశాలురు ,వారిలో కొందరికి చెవులుండవు . కొందరికి పెదవులు చెవులు వరకు వ్యాపించి ఉంటాయి . కొందరి ముఖములు అయోమయములై భీతిని కలిగిస్తాయి . వారు ఒకే ఒక పాదము కలవారి వేగముగా తిరుగుతుంటారు . కొందరు సురభక్షకులు ,కొందరు కిరాతులు , కొందరు కప్పివుండే కేశములు కలవారు కొందరు బంగారు వన్నె కలిగి అందముగా వుంటారు ,కొందరు కిరాతులు ద్వీపములలో నివశించుచు పచ్చి చేపలను తిందురు . కొందరు జలములలో సంచరించుచుందురు . వారు భంయంకరులు నరవ్యాఘ్రములుగా ప్రసిద్దికెక్కినవారు . వీరందరి నివాస స్థానములకు వెళ్ళి ,వానరులందరూ సీతాదేవి ఆచూకీని వెదకవలెను . 
ఇలా కొంత దూరము వెళ్లిన తర్వాత యవద్వీపము కనపడును . అది రత్నముల రాశిగా పేరుపొందినది . ఏడూ ఖండములుగా ఏర్పడి వున్నది . దాని చుట్టు సముద్రము కొండలు ఆవరించి వున్నాయి . నావలా ద్వారా కానీ ఎగిరి కానీ అచటికి వెళ్లవలెను . పిమ్మట సువర్ణ ద్వీపమును రూప్యకా ద్వీపము చేరతారు . అవి బంగారు వెండి ఘనులకు నెలవైనవి . యవద్వీపమును దాటిన పిమ్మట శిశిరం అను పర్వతము కనపడును దాని శిఖరములు ఆకాశమును తాకును . దేవతలు దానవులు అచట విహరిస్తారు . ఆ ప్రదేశం అంతా వెతుకుము . 
పిమ్మట సముద్రమును దాటి అవతల తీరము కల శోణానాదమునకు చేరవలెను . అది మిక్కిలి లోతయినది . ఎర్రని జలములతో వేగముగా ప్రవహించునది . ఆ ప్రదేశమున సిద్దులు చారణులు విహరిస్తారు . అక్కడ చిత్రవిచిత్రములు వుండే రమ్యమైన వనములు కలవు . అక్కడ వెతుకుము . 
ముందుకు వెళ్తే ఇక్షు సముద్రము వచ్చును . అది పెనుగాలులకు ఉవ్వెత్తుగా ఎగసిపడు తరంగములతో తీవ్ర ఘోషలతో ఉంటుంది . ఆ సముద్రములో వెదికినా తర్వాత భయంకరములైన ద్వీపములను గాలించండి . దానిని దాటినా పిదప లోహితము అను మధు సముద్రము తీరమునకు చేరెదరు . అక్కడ బూరుగు వృక్షములు అధిక సంఖ్యలో కలవు . అందువల్ల దానికి శాల్మలీ ద్వీపము అని పేరు . వినతా పుత్రుడైన గరుత్మంతుడి భవనము అక్కడ వుంది . అక్కడ మందేహులు అను రాక్షసులు ఉందురు . 
అచటి నుండి ముందుకు వెళ్తే క్షీరోదము అను సముద్రము కనిపిస్తుంది . ఆ సముద్ర మధ్యములో ఋషభము అను పేరు కల తెల్లని మహా పర్వతము ఉండును . అక్కడ అన్ని వైపులా వృక్షమలు వ్యాపించి ఉండును . ఆ అక్కడి నుండి ముందుకు వెళ్లిన తర్వాత స్వచ్ఛమైన మధుర జలము కల మహా సముద్రము కలదు . ఆ సముద్రములో ఔర్యుడు అను పేరుకల మహాముని తేజస్సు ప్రవేశించెను . ఆ బడబాగ్నికే హయాముఖం అని పేరు అక్కడికి 13 యోజనాల దూరములో "జాతరూపశిలము "అనే పేరు కల బంగారు పర్వతము కలదు ఆ గిరి శిఖరమున సర్పాకృతి అనంతుడు అనుపేరుతో ఆదిశేషుడు ఆసీనుడై ఉండును . 
అది దాటినా తర్వాత :ఉదయాద్రి "కనిపించును . పూర్వము శ్రీమహా విష్ణువు వామనావతార సమయమున త్రివిక్రముడై ఒక పాదమును సౌమనస శిఖరము మీదను ,రెండవ పాదమును మీరు పర్వతము పైన ఉంచెను . సూర్యుడు జంబూద్వీపమునకు ఉత్తర భాగమున ప్రభవించి మిక్కిలి ఉన్నతమైన సౌమనస శిఖరమును  చేరిన పిమ్మట మేరుగిరికి దక్షిణ భాగమున వున్నా వారికి స్పష్టముగా గోచరించును 
ఉదయాద్రికి ముందు భాగమున సుదర్శన ద్వీపము కలదు సూర్యుడు ఉదయగిరిపై కల సౌమనస శిఖరము మీదికి చేరినంతనే ఆ స్వామి యొక్క కిరణ ప్రశముతో సుదర్శన ద్వీప నివాసులలో చైతన్యము వెల్లివిరియును . అందువలననే దీనికి సుదర్శనద్వీపము అను పేరు ఏర్పడినట్లు ప్రతీతి . ఆ ఉదయాచలము యొక్క పరిసర ప్రాంతములలో రావణునికి ,సీతాదేవికి అంతటా వెతుకుము . 
దానిని దాటినా తర్వాత ఆప్రాంతము అంతా అగమ్యము (వెళ్లలేనిది ),అది దేవతలకు నివాసము అక్కడ సూర్యచంద్ర కిరణము పడవు కాబట్టి అది అంధకారము గా ఉంటుంది ,అదృశ్యము . ఓ వానరులారా !ఉదయాద్రి వరకే వానరులు వెళ్ళగలరు దాని తర్వాతి ప్రదేశములు అన్నీ చిమ్మచీకట్లతో నిండి ఉంటాయి . అవి నిర్జన ప్రదేశములు . వాటిని గురించి నాకు తెలియదు . 
నేను చెప్పినట్లుగా ఉదయ గిరి వరకు కల సంస్థ ప్రదేశమును ఆణువణువూ జాగ్రత్తగా సీతాదేవి జాడకొరకు అన్వేషించండి . ఒక నెలలోపు మీరు తిరిగి రావాలి . ఆ నెల్ గడువు దాటినచో నా చేతిలో మీకు చావు తప్పదు . సీతాదేవికి అన్వేషించి కృతార్థులై తిరిగి రండి . ఓ వానరులారా తూర్పు డిక్కీ అంటా వనములు ఎక్కువగా ఉంటాయి . ఆ దిక్కు దేవేంద్రుని అధీనములో వుంది . ఆ ప్రదేశమును నేర్పుగా వెతకండి . శ్రీరాముని ధర్మపత్ని ఐన సీతాదేవి జాడను తెలుసుకుని హాయిగా తిరిగి రండి మీకు క్షేమము అగుగాక "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Monday 25 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పది తొమ్మిదవసర్గ

                               రామాయణము 

                                కిష్కిందకాండ -ముప్పది తొమ్మిదవసర్గ 

తన వద్దకు వచ్చిన సుగ్రీవుని  ఇసుక వేస్తె రాలనంతగా వున్నా వానరులను చూసి సంతోషముతో ,ఉత్సాహముతో శ్రీరాముడు సుగ్రీవుని కౌగిలించుకొని ఆయనను పొగిడెను . వారు ఇలా మాట్లాడుకుంటుండగా ఇంకనూ వానర ప్రముఖులు కొందరు వానరులతో అచటికి వచ్చిరి .  అలా వచ్చిన వానర వీరుల వివరములు . 
"శతవాలి "అను వానరవీరుడు పదివేలకోట్లమంది అనుచరులతో అచటికి చేరెను . 
తారకు తండ్రి అయినా సుషేణుడు పెక్కువేలకోట్లమందితో అచటికి వచ్చెను . 
సుగ్రీవునికి మామ అయిన రుమతండ్రి మరి ఒక వేయి కోట్ల మందితో అచటికి వచ్చెను . 
హనుమంతుడి తండ్రి అగు కేసరి వేలకొలది వానరులతో అచటికి  వచ్చెను . 
గవాక్షుడు అను వాడు వేలకోట్ల మందితో అచటికి వచ్చెను . 
మహాకాయుడు అయిన నీలుడు పదికోట్లమందితో అచటికి వచ్చెను . 
గవయుడు అను వానర సేనా నాయకుడు అయిదు కోట్లమంది తో అచటికి చేరెను . 
దరీముఖుడు అను వానర నాయకుడు వేయి కోట్ల మందితో అచటికి చేరెను . 
అశ్వనీ దేవతలా కుమారులైన మైందుడు ,ద్వివిదుడు అనువారు చేరిఒక వేయి కోట్ల మంది అనుచరులతో అచటికి చేరిరి . 
గజుడు అను మహాశక్తివంతుడైన వానరవీరుడు మూడు కోట్లమందితో అచటికి చేరెను . 
భల్లూక ప్రభువైన జాంబవంతుడు పదికోట్లమంది భల్లూక యోధులతో అచటికి చేరెను . 
రుమన్వంతుడు  అను వానర ప్రముఖుడు వందకోట్లమంది అనుచరులను వెంట పెట్టుకుని అచటికి వచ్చెను . 
గంధమాధనుడు అనువాడు కోటానుకోట్ల మందిని వెంటపెట్టుకుని అచటికి వచ్చెను . 
యువరాజైన అంగదుడు నూరు శంకువులు సంఖ్యలో వానరులను వెంటపెట్టుకుని అచటికి వచ్చెను . 
తారుడు అను వాడు అయిదు కోట్ల మంది వానరులతో అచటికి వచ్చెను . 
ఇంద్రజానువు అనువాడు పదకొండు కోట్ల మంది వానరులతో అచటికి వచ్చెను . 
రంభుడు అనువాడు కోట్లకొలది వానర వీరులతో అచటికి చేరెను . 
దుర్ముఖుడు అనువాడు రెండు కోట్లమందితో అచటికి వచ్చెను . 
హనుమంతుడు వెయ్యికోట్ల మంది బలిష్ఠులైన అనుచరులతో వచ్చెను . 
నలుడు వృక్షములపై నివసించు కోట్లకొలది వానరులతో అచటికి వచ్చెను .
 శుభలక్షణ సంపన్నుడైన దధిముఖుడు పదికోట్లమంది వానరులతో అచటికి వచ్చెను . 
శరభుడు ,కుముదుడు ,వహ్ని ,రంహుడు ఇంకా కొంత మంది కామరూపులైన వానరులు పర్వతాలతో ,వనాలతో కూడిన సంస్థ భూమండలమును గాలించి అసంఖ్యాకులైన వానరులను తీసుకుని వచ్చిరి . 

వారంద్రూ కేరింతలతో కోలాహలంతో తమ రాకను వానర ప్రభువైన సుగ్రీవునికి తెలిపి సుగ్రీవుని ఎదుట వినమ్రతతో నిలబడిరి . ఆ సమయములో సుగ్రీవుడు శ్రీరాముని కి నస్కారము చేసి అచటకు వచ్చిన వానర వీరుల గురించి ఆయనకు తెలిపెను . పిమ్మట వానర వీరులతో" వీరులారా !పర్వతములో ,వృక్షముల వద్ద సేద తీరనుంది ఆయా నాయకులు తమ అనుసరులను చూసుకోండి "అని పలికెను . 

రామాయణము కిష్కింద కాండ ముప్పది తొమ్మిదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ) , తెలుగు పండితులు 






రామాయణము కిష్కిందకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                                రామాయణము 

                         కిష్కిందకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

వానరుల వద్దకు దూతలను పంపిన పిదప సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి శ్రీరాముని వద్దకు వచ్చెను . శ్రీరామునితో తగు రీతిగా మాట్లాడి వానరులు వచ్చుచున్న సంగతి ఆయనకు తెలిపి ఆయనను ఊరడించెను . వానరులందరూ అచటికే వచ్చి సుగ్రీవునికి బహుమతులు ఇచ్చిరి . వానరులను చూసిన సుగ్రీవుడు ,రాముడు తృప్తి చెందెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియెనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము కిష్కిందకాండ -ముప్పదియేడవసర్గ

                                           రామాయణము 

                                       కిష్కిందకాండ -ముప్పదియేడవసర్గ 

మహాత్ముడగు లక్ష్మణుడు ఇలా పలికిన పిమ్మట సుగ్రీవుడు తన పక్కనే వున్న హనుమంతునితో "హనుమా !మహేంద్రగిరి ,హిమవత్పర్వతము ,వింధ్యాచలము ,కైలాసపర్వతము ,మందరాచలము ఈ అయిదు పర్వతాలపై కల వానరులను ఇక్కడకు తీసుకురావలెను . పడమటి దిక్కున సముద్రతీరమునందు కల పర్వతములపై వున్న వానరులను ,ఉదయగిరినందు కల పద్మాతాళవనము నందు కల వానరులను ,అంజనాద్రి పై వుండు నల్లగా ఏనుగుల వాలే బలిశాముగా కల వానరులను ,మీరు పర్వతముపై కల వానరులను ,దూమ్రగిరిపై కల వానరులను ఇంకనూ ఈ భూమండలముపై కల సంస్థ వానరులను ఇచ్చటికి వెంటనే తీసుకురావలయును . ఆయా వానరులందరిని సామ దాన ఉపాయములతో ఇక్కడకు రప్పించు టకు కొందరు దూతలను పంపుము .    
             ఇంతకూ ముందే నేను కొందరు దూతలను పంపివున్నాను . వారిని తొందరపెట్టి ఇక్కడకు తీసుకు వచ్చుటకు త్వరగా  వెళ్లగల వానరులను దూతలుగా పంపుము . ఈ భూలోకమునందలి సంస్థ వానరులు ఒక 10 దినములలోపల ఇక్కడకు రావాలి . రానివారిని రాజాజ్ఞను దిక్కరించినట్టుగా భావించి శిక్షించెదను . ఇది నా ఆదేశము "అని పలికెను . 
సుగ్రీవుడు ఆ విధముగా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే వానరుల స్థానములు బాగా తెలిసిన దూతలందరూ హనుమంతుడి ప్రేరణచే అన్ని దిక్కులకు వెళ్లెను . అలా వెళ్లిన వానరులు ఈ భూమండలముపై కల వివిధ ప్రదేశములలో ,అరణ్యములలో ,పర్వతములలో కొండగుహలలో ఉన్న వానరులందరిని కిష్కిన్దాకు తరలించెను . వానర ప్రభ్వయినా సుగ్రీవాజ్ఞను వినగానే వానరులందరూ గడగడ వణుకుచూ కిష్కింధకు పయనమయ్యిరి . 
కాటుక వలే నల్లని వారు మిక్కిలి వేగము కలవారు అయిన మూడు కోట్లమంది వానరులు అంజనాద్రి నుండి రాముడు వున్న ప్రదేశమునకు వచ్చిరి . 
మేలిమి బంగారు రంగు కల వారు అస్తాద్రి అందు నివసించు పది కోట్లమంది అచటికి విచ్చేసిరి . సింహము జూలు వంటి వన్నె కలవారు వేయికోట్లమంది కైలాసపర్వతము నుండి వచ్చిరి . 
హిమవత్పర్వతము ను ఆశ్రయించి వున్న ఫలమూలాదులతో జీవించెడివారు వేలకోట్లమంది వచ్చిరి . 
ఎర్రని దేహము కలవారు భయంకర స్వరూపులు ,భీకరమైన చేష్టలు కలవారు అయిన కోట్లకొలది వానరవీరులు కోట్లకొలదిగా వచ్చిరి . 
కొందరు పాలసముద్రము నుండి వచ్చిరి . వారి ఆహారము కొబ్బరి . వారి సంఖ్య లెక్కించలేనిది . వనములనుండి ,నదీ తీరములనుండి ,వానరసేనలు గుంపులు గుంపులుగా సూర్యకాంతులు కప్పివేయుచు మిక్కిలి వేగముగా వచ్చిపడిరి . 
వానరులను తీసువచ్చుటకు వచ్చిన దూతలు వారు వెళ్లిన చోట కల సుగంధ భరితములైన పూవులు ,ఫలములు ,తదితర వస్తువులు కానుకలుగా తీసుకువచ్చి సుగ్రీవునికి ఇచ్చిరి . వచ్చిన వానరులను చూసి సంతుష్టుడై దూతలు తెచ్చిన కానుకలను సంతోషముతో స్వీకరించెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday 24 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదిఆరవసర్గ

                                రామాయణము 

                            కిష్కిందకాండ -ముప్పదిఆరవసర్గ 

ఆవిధముగా తారామ మాటలకు శాంతించిన లక్ష్మణుని చూసి ధైర్యమును తెచ్చుకున్న సుగ్రీవుడు లక్ష్మణునితో "ఓ మహానుభావా !శ్రీరాముడు మహా వీరుడు ,పరాక్రమవంతుడు ,ఏడుమద్దిచెట్లను ,పర్వతమును ,భూమిని తన బాణములతో చీల్చగల రాముడికి ఎవరి సహాయము అవసరము లేదు అది నిమిత్త మాత్రమూ మాత్రమే . ఆ సదవకాశము నాకు కలుగుట నా అదృష్టము . నేను తప్పక శ్రీరాముని వెనక వుంటాను . శ్రీ రాముని పై కల విశ్వాసము వలన కానీ ,చనువుతో కానీ నేనేమయినా హద్దుమీరి ప్రవర్తించినట్లయితే నన్ను క్షమించుము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న లక్ష్మణుడు ప్రేమతో "సుగ్రీవా !తప్పులు చేయుట జీవుల సహజము కానీ ఆ తప్పులను అంగీకరించి క్షమాపణ అడుగుతా మాత్రము అందరికి సాధ్యము కానీ విషయము . ఆ విషయమున నీవు కృతకృత్యుడవు . ఓ వానరరాజా !సోకనిమగ్నుడై ఉన్న శ్రీరాముని పలుకులు విని నేను మిక్కిలి వ్యధ చెందితిని . ఆ వేదన కారణముగా నేను కోపములో నిన్ను నా పరుష మాటలతో బాధించాను . నన్ను క్షమించుము . నీవు వేణు వెంటనే బయలుదేరి నీ మిత్రుడి వద్దకు వచ్చి ఆయనను ఓదార్చుము "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


రామాయణము కిష్కిందకాండ - ముప్పదియైదవసర్గ

                                      రామాయణము 

                                  కిష్కిందకాండ -       ముప్పదియైదవసర్గ 


ఆ విధముగా పరుషముగా పాట్లాడుతున్న లక్ష్మణుని చూసి సుగ్రీవుడు సమాధానము చెప్పుటకు సైతము ధైర్యము చేయలేకపోయెను . అప్పుడు తార ఎదరకు వచ్చి లక్ష్మణునితో "ఓ మహానుభావా !సౌమిత్రి !నీవు గొప్ప ధర్మాత్ముడవు నీవు ఈ  విధముగా పలుకుట తగదు . పైగా సుగ్రీవుడు వానరారాజు పైపెచ్చు నీకు మిత్రుడు ఆయనతో నీవు ఈవిధముగా పలుకుట తగదు . వాలి భయముతో ఇన్నాళ్లు సుగ్రీవుడు సరి అగు తిండి ,నిద్ర లేక చెట్లవెంట ,పుట్లవెంట తిరుగుతూ రోజులు గడిపెను . ఇప్పుడు ఈ సౌఖ్యములలో పడి సేదతీరుతూ వున్నాడు . ఆయన కృతఘ్నుడు కాడు . 

సుగ్రీవుడు ఈ సౌఖ్యములలో వున్నా ,రామకార్యమును మరువలేదు . సీతాన్వేషణకు అవసరమయితే ప్రత్యర్థి తో యుద్ధము చేయుటకు అవసరమగు సమస్త సైన్యమును సమీకరించు ఏర్పాట్లు ఆయన మునుపే చేసి వున్నారు ఇప్పుడో ఇంకాసేపటికో పెద్దసంఖ్యలో వానర సైన్యము నీ ముందుకు వచ్చును . ఆయన అధీనములో కొన్ని లక్షల సంఖ్యలో వానరములు ,భల్లూకములు ,కొండముచ్చులు వున్నవి . వాటన్నిటిని కూడా ఈ కిష్కిన్దకు రప్పించు ఏర్పాట్లు చేసి వున్నాడు . వారందరి రాక కొరకు ఎదురు చూస్తూనే సుగ్రీవుడు ఈ నగరము కదలలేదు . అంతే తప్ప ఆయన మనసులో మరే చేదు ఆలోచనా లేదు . 
ఇప్పటికే వాలి మరణముతో కిష్కింద రాజ్యములోని స్త్రీలు వృద్దులు అందరూ భీతి చెంది వున్నారు . ఇప్పుడు ఆగ్రహముతో బుసలుకొడుతున్న నిన్ను చూసి ఇంకా భయపడుతున్నారు . కావున విషయము గ్రహించి శాంతించుము , శ్రీరాముని కోసము సుగ్రీవుడు ఏమి చేయటానికైనా సిద్దము . తనరాజ్యమును ,తన భార్య రుమను ,తుదకు తన ప్రాణములు త్యజించుటకు కూడా సుగ్రీవుడు వెనుకాడడు . ఇది సత్యము "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియైదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Friday 22 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదినాల్గవసర్గ

                           రామాయణము 

                              కిష్కిందకాండ -ముప్పదినాల్గవసర్గ 

ఎదిరింపశక్యము కాని  వాడు ,నరశ్రేష్ఠుడు ఐన లక్ష్మణుడు క్రుద్ధుడై తన మందిరమునకు ప్రవేశించినంతనే చూచి సుగ్రీవుడు నిశ్చేష్టుడయ్యెను . సుగ్రీవుడు కంగారులో ఒక్క వుదుటన ఎగిరిపడెను . అలంకృతుడైన సుగ్రీవుడి కన్నులు మత్తుచే ఎర్రబడివుండెను . అతడు దోసిలి ఒగ్గి తడబడుచున్నవాడై లక్ష్మణుని సమీపించేను . 
నక్షత్రముల మధ్య చంద్రుడికి వలె స్త్రీల మధ్యలో వున్న సుగ్రీవునితో లక్ష్మణుడు కోపముతో ఇలా అనెను . 
"సుగ్రీవా !ధైర్యశాలి ,మెత్తని స్వభావము కలవాడు ,ఇంద్రియ నిగ్రహము కలవాడు ,సత్యవచనుడు ఐన రాజే ఈ లోకమున గౌరవాదరములకు అర్హుడగును . అధర్మపరుడు ,ఉపకారముచేసిన మిత్రుడికి మాట ఇచ్చి తప్పినవాడు ,ఐన రాజు మిక్కిలి క్రూరాత్ముడుగా పరిగణింపబడును . అశ్వ విషయమున అసత్యము పలికినవాడు ,నూరు అశ్వములను చంపిన పాపము మూటకట్టుకుంటాడు . అట్లే గోమాత విషయమున అసత్యము పలికినవాడు వేయి గోవులను చంపిన పాపము మూటకట్టుకుంటాడు . ఆవిధముగానే తోటి మానవుడికి వాగ్ధానము చేసి తప్పినవాడు ,బంధువులను చంపినవాడితో సమానము . శ్రీరామచంద్రుకి ఇచ్చిన మాట తప్పినచో సకల మనుష్యులను చంపిన పాపము కలుగును . 
బ్రహ్మహత్యకు పాల్పడిన వాడికి ,మద్యపానము చేసినవాడికి ,దొంగకు ,వ్రతభంగమొనర్చినవానికి ప్రాయశ్చిత్తము ద్వారా పాపము నుండి విముక్తి కలుగును . కానీ కృతఘ్నుడికి మాత్రము ఏ విధముగానూ పాపము నుండి విముక్తి కలుగదు . కావున నీవు ఇచ్చిన మాటకు గుర్తుతెచ్చుకుని వెంటనే సీతాన్వేషణకు పనులు ప్రారంభించు "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదినాల్గవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము కిష్కిందకాండ -ముప్పదిమూడవసర్గ

                                 రామాయణము 

                           కిష్కిందకాండ -ముప్పదిమూడవసర్గ 

అంగదుడు లక్ష్మణుని ఆహ్వానించుటకు ఎదురు వెళ్లెను . అంగదుడు లక్ష్మణుని గౌరవంగా లోనికి ఆహ్వానించెను . అంగదుడు కానీ ,ద్వారపాలకులు కానీ ఇతరులయిన వానర వీరులుకాని ఆయనను సమీపించుటకు ధైర్యము చేయలేక దూరంగానే ఉంటిరి . లక్ష్మణుడు అంగదుడి వెనుక ఏడూ ప్రాకారములు దాటెను . వివిధములగు వానరవీరుల భవనములను దాటుతూ సుగ్రీవుడి ఆంతరంగిక మందిరమునకు చేరెను . అది చాలా వైభవోపేతముగా ఉండెను . అచట అనేకమైన స్త్రీలు కలరు . వారు ఎంతో విలువకల ఆభరణము వడ్డాణములు ధరించి వున్నారు . లోపలినుండి కాళీ అందేలా సవ్వడి విని లక్ష్మణుడు లోపలకు వెళ్ళుటకు సంకోచించి దూరముగా ఒక చోట నిలబడెను . స్త్రీల అందేలా చప్పుడు విన్న లక్ష్మణునికి కోపము రెట్టింపయ్యేను . అంత అతడు కోపముతో ధనుష్టంకారము చేసెను . 
ఆ చప్పుడు విన్న సుగ్రీవుడు ఉలిక్కిపడి ఆసనము పైనుండి లేచెను కానీ లక్ష్మణుని ఎదుటకు వచ్చుటకు ధైర్యము చాలక ,తారను లక్ష్మణుని వద్దకు వెళ్లి ఆయనను శాంతింపచేయమని ,మహాత్ములు స్త్రీలపై కోపము ప్రదర్శించరని పలికి ఆమెను పంపెను . సుగ్రీవుడి ఆజ్ఞపై తార లక్ష్మణుని వద్దకు వచ్చి ,ముందుగా ఆయనను ప్రసన్నుండిని చేసుకొని ,కోపము విడిచి శాంతించమని ప్రార్ధించి ,సుగ్రీవుడి తప్పిదాన్ని క్షమించమని కోరెను . పిమ్మట ఆమె సుగ్రీవుడు సీతాన్వేషణకు పనులు ప్రారంభించెనని లక్ష్మణునితో పలికెను వానరవీరులను కిష్కింధకు రావలిసిందిగా దేశమంతా వర్తమానము సుగ్రీవుడు పంపాడని ,వేలాదిగా కిష్కింధకు వాంతారా వీరులు వచ్చుచున్నారని తెలిపెను . 
అప్పుడు లక్ష్మణుడు కొంత శాంతించెను . ఆమె ఆహ్వానము తో సుగ్రీవుడు వున్నా మందిరంలోకి ప్రవేశించేను . అచట సుగ్రీవుడు పీడా ఆసనంపై సకల ఆభరణములతో దేవేంద్రుని వలే  ఆసీనుడై వున్నాడు . ఆయన చుట్టూ వేలాదిగా స్త్రీలు వున్నారు . అదంతా చూసిన లక్ష్మణుడికి కోపము పెరిగెను . అలా మిక్కిలి కోపముతో ఎర్రబడిన పెద్దపెద్ద కనులతో వున్న లక్ష్మణుని సుగ్రీవుడు చూసేను . 

 రామాయణము కిష్కిందకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

                                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము కిష్కిందకాండ -ముప్పదిరెండవసర్గ

                                   రామాయణము 

                                   కిష్కిందకాండ -ముప్పదిరెండవసర్గ 

మత్తు నుండి బయటకు వచ్చిన సుగ్రీవుడు లక్ష్మణుడు కోపముగా వచ్చినట్లు మంత్రులవలన తెలుసుకుని బయపడసాగెను . ఏమిచేయాలో తోచక తన మంత్రులతో "ఓ మంత్రులారా !లక్ష్మణుడు అంత కోపముగా ఉండుటకు కారణము ఏమయి ఉండును . నేను ఆయనకు ఏమియు అపరాధము చేయలేదు కదా ! ఇంతకూ మునుపు నేను ఎప్పుడు ఆ మహానుభావునితో కనీసము పరుషముగానైనా మాట్లాడివుండలేదు . ఆయన కోపము శాంతించు ఉపాయము ఏదయినను చెప్పండి "అని పలికెను . 
             ఆ మాటలు విన్న మంత్రులు "ఓ వానర రాజా !లక్ష్మణుడు మీరు సీతాదేవి అన్వేషణకు ఏ ప్రయత్నము చేయుట లేదని కోపముగా వుండి  ఉండవచ్చు . రామలక్ష్మణులు బలపరాక్రములు ,మహానుభావులు వారు నీకు మహోపకారం చేసినారు . లోకోపవాదమును గూర్చి ఏమాత్రము ఆలోచించక నీ అన్నాను చంపి నీ భార్యను నీ రాజ్యమును నీకు అప్పగించారు . అట్టి వారితో విరోధము తగదు . వారు చేసిన ఉపకారమునకు బదులుగా నీవు వారికి సహాయము చేయవలెను అది నీ బాధ్యత . ప్రస్తుతము నీవు బందు మిత్రులతో సహా లక్ష్మణుని శరణు కొరుము ,ఆయనను ప్రసన్నుడిని చేసికొనుము . ఆయన పరుషముగా మాట్లాడినను పల్లెత్తు మాట మాట్లాడక భరించుము "అని పలికెను . 

రామాయణము కిష్కింద కాండ ముప్పదిఏందవాసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Wednesday 13 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదియొకటవసర్గ

                            రామాయణము 

           

                          కిష్కిందకాండ -ముప్పదియొకటవసర్గ 

దశరథ మహారాజా కుమారుడైన శ్రీరాముడు ఆ విధముగా సీత ఎడబాటుతో దీనంగా పలికిన పలుకులు విన్న లక్ష్మణుడు కోపముతో అన్న మాటలు సుగ్రీవునికి చెప్పుటకు బయలుదేరెను . లక్ష్మణుడు  దీనుడైన వున్న తన అన్న ఒక పక్క రాజ్యభోగములలో తేలుతున్న సుగ్రీవుడు ఒక పక్క అని కోపముతో పెద్దపెద్ద అడుగులు వేస్తూ కిష్కింధకు బయలుదేరెను . ఆయన వేగముగా నడుస్తుంటే కాలికింద పడు రాళ్లు నుగ్గునుగ్గు అవుతున్నాయి . తాడి చెట్లు ,మద్ది చెట్లు నెలకొరుగుతున్నాయి . ఆ విధముగా కిష్కింద వైపు వచ్చిన లక్ష్మణుడు అక్కడ కనిపించిన వానరులను చూసి ఇంకా కోపోద్రిక్తుడయ్యెను . 

లక్ష్మణుడు కోపముతో భీకరముగా వచ్చుట చూసిన వానరులందరూ భయముతో చెట్లపైకి ఎక్కసాగిరి . ఎవరివైపు చూడకుండా ,ఎవరితోనూ మాట్లాడకుండా లక్ష్మణుడు తిన్నగా సుగ్రీవుడి అంతఃపురములోకి ప్రవేశించెను . లక్ష్మణుని చూసి అచట వున్న మంత్రులు సైతము వణకసాగిరి . అచ్చటనే వున్న అంగదుని చూసి లక్ష్మణుడు "అంగదా !నీ పినతండ్రికి నేను వచ్చినట్లుగా తెలియజేయి "అని పలికెను . లక్ష్మణుని ఆజ్ఞ ప్రకారము అంగదుడు సుగ్రీవునికి లక్ష్మణుని రాకను తెలియజేయుటకు అంతరాళములోకి ప్రవేశించెను . 
ఆ సమయములో సుగ్రీవుడు తన రాణులతో కలసి మద్యం మత్తులో ఉండెను . అంగదుడు  పలికిన పలుకులు కూడా సుగ్రీవుని చెవికి ఎక్కలేదు . లక్ష్మణుని ముందున్న మంత్రులు ఎంతో బుద్దికుశులురు వారు లక్ష్మణుని బహువిధములుగా పొగిడి అతడికి మర్యాద చేసి వారు కూడా లక్ష్మణుడి రాక గురించి సుగ్రీవునికి తెలియచేయుటకు వెళ్లిరి . వారు సుగ్రీవునితో లక్ష్మణుని రాకను గురించి తెలిపిరి . అయినను మద్యం మత్తులో వున్నా సుగ్రీవుడు చెవికెక్కలేదు . లక్ష్మణుని భీకర కోపముతో వున్నా ఆకారముని చూసి వానరులు భయముతో గగ్గోలు పెట్టసాగిరి . ఆ పెద్ద అరుపులకు సుగ్రీవునికి కొంత తెలివి వచ్చెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియొకటవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Friday 8 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదియవసర్గ

                                             రామాయణము 

                                                కిష్కిందకాండ -ముప్పదియవసర్గ 

సుగ్రీవుడు నీలునికి వానరులను సమీకరించు భాద్యతను అప్పగించి అంతఃపురములోకి ప్రవేశించెను . ప్రసవనగిరిపై శ్రీరాముడు మేఘములు తొలగిపోవుటచే నిర్మలంగా ఉన్న ఆకాశమును చూసి సీతాదేవి ఎడబాటుకు మిక్కిలి శోకపీడితుడయ్యెను . సీతాదేవి కొరకు ఇంకనూ వ్యాకులుడయ్యెను . ఇంతవరకు జానకి జాడ తెలియదయ్యెను ,రావణునిపై దండెత్తుటకు సమయము మించిపోవుచున్నది . అని ఆలోచిస్తూ శ్రీరాముడు శోకములో మునిగిపోయెను . పిదప కొంత సమయము తర్వాత లక్ష్మణుని పిలిచి 
               "లక్ష్మణా !సుగ్రీవుడు భోగలాలసుడై వర్షాకాలం గడిచినపిదప సీతాన్వేషణ చేయుదునని నాకు ఇచ్చిన ప్రతినను మరచినట్లున్నాడు . తమ్ముడా !సుగ్రీవునితో సమయానుకూలంగా మాట్లాడి ,అతడు మనకు చేసిన ప్రతిమను గుర్తుచేసి ,మన పని ముందుకు సాగునట్లు చేయుము" అని దీనవధానుడై పలికెను . ఈ విధముగా తన అన్న భాదను చూసిన లక్ష్మణుడు సుగ్రీవునిపై మిక్కిలి కోపముతో మండిపడుతూ అతడిని శిక్షించుటకు సిద్దపడెను . 
               రామాయణము కిష్కింద కాండ ముప్పదియవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                   


Sunday 3 February 2019

రామాయణము కిష్కింద కాండ -ఇరువదితొమ్మిదవసర్గ

                                            రామాయణము 

                                           కిష్కింద కాండ -ఇరువదితొమ్మిదవసర్గ  

కిష్కింధకు రాజు అయిన పిమ్మట సుగ్రీవుడు రాజ్యాకార్యములను పట్టించుకొనక మంత్రులపై కార్యభారములను విడిచి నిత్యమూ భోగలాలసుడై ఉండెను . సమస్త కార్యములు అదుపు తప్పినవి . మంత్రులు రాజ్యభారమును పట్టించుకొనక ఉండెను . సమస్త విషయ సమర్థుడు అయిన హనుమంతుడు ,వర్షాకాలం ముగిసిన పిమ్మట ,శరద్కాలము వచ్చేనని గ్రహించి వెంటనే సుగ్రీవుని వద్దకు వెళ్లి సమయోచితముగా ఇలా మాట్లాడనారంభించెను . 
"పూజ్యుడైన ఓ ప్రభూ !నీకు రాజ్యాధికారం సంప్రాప్తించినది . కీర్తిప్రతిష్టలు అబ్భినవి ,వంశపారంపర్యముగా వచ్చిన సంపదలు వృద్ధి అయినవి . వానర భల్లూకములకు ప్రభువైన ఓ సుగ్రీవా !నీవు పరాక్రమవంతుడవు ,మహా శక్తిమంతుడవు . మహాత్ములైన కోట్లకొలది వానర యోధులు నీ అధీనములో వున్నారు . వారిని ఎంతటి వారైనా ఎదిరించలేరు . నీకు సహాయము చేసిన రామునికి ప్రత్యుపకారము చేయవలసిన సమయము ఆసన్నమయినది . వర్షాకాలం ముగిసినది . శరద్కాలము ఆరంభమయినది సీతాన్వేషణకు ఇదే సరి అయినా సమయము . సీతాన్వేషణకు నీ సైన్యమును నియోగించు మహానుభావుడైన శ్రీరాముడు బలపరాక్రమ సంపన్నుడు దేవతలు సైతము అతనిని ఎదిరించజాలరు . అంతటి మహానుభావుడు నీ సహాయమును ఆశించాడు . తక్షణమే ఆయనకు సహాయము చేయుము . ఆయన చెప్పిన తదుపరి మనము పనులు ప్రారంభించిన కాలయాపన అవుతుంది "అని పలుకగా సుగ్రీవుడు 
తన కర్తవ్యమును సమాలోచించుకుని సైన్యాధిపతి అయిన నీలుని పిలిపించి ఎక్కడెక్కడి వానర వీరులను 15 రోజులలోపు కిష్కింధకు చేరవలసినదిగా ఆజ్ఞ ఇచ్చాడు . అలా 15 రోజులలో రాణి వానరులకు మరణ దండన విధించబడుతుందని చెప్పాడు వానరులకు సమాచారమును చేరవేయు పనిని నీలునికి ,ఆంజనేయునికి అప్పగించాడు . ఆవిధముగా ఆజ్ఞ ఇచ్చి పిమ్మట సుగ్రీవుడు తన అంతఃపురమునకు వెళ్లెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువది తొమ్మిదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు 0,తెలుగు పండితులు . 











                                      రామాయణము 

                                          కిష్కిందకాండ -ఇరువది ఎనిమిదవసర్గ 

వర్షాకాలం వచ్చెను . వర్షము ఎడతెరిపి లేకుండా కురవసాగెను . రామలక్ష్మణులు ప్రసవన   గిరిపై  ఉండెను . వర్షాకాలం ముగిసిన పిమ్మట సీతాన్వేషణ సుగ్రీవుడు చేయునని రాముడు లక్ష్మణునితో పలికెను . భరతుడిని గుర్తుచేసుకొనెను . 
రామాయణము కిష్కిందకాండ ఇరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                                    రామాయాణం 

                                                          
                                                కిష్కింద కాండ  ఇరువది ఏడోవ సర్గ 
సుగ్రీవుడు కిష్కింధకు పట్టాభిషిక్తుడయ్యెను . వానర వీరుల సంతోష కోలాహలం ఆకాశమును తాకినది . రామలక్ష్మణులు ప్రసవనగిరి అనే పర్వతముపై కల ఒక గుహలో తమ నివాసము ఏర్పరుచుకొనిరి . ఆ ప్రసవనగిరి పరమ రమణీయమైన ప్రదేశము . ఆ ప్రాంతమున స్వచ్ఛమైన జలములకు కానీ ఫల, పుష్పములకు కానికొదువ లేదు . పచ్చని ప్రకృతితో అత్యంత సుందరమగు ప్రదేశము ఆ ప్రసవనగిరి . అంతటి సుందర ప్రదేశములో ఉన్నప్పటికీ రాముని మనస్సు సీత పక్కన లేదనే బాధతో ఎల్లప్పుడూ కలతచెందుతూ వుడేడిది . శ్రీరాముడు అశృనయనములతో ఉండుట చూసిన లక్ష్మణుడు తల్లడిల్లెడివాడు . లక్ష్మణుడు అన్న గారికి ధైర్యము చెప్పి ,ఆయన దైన్యమును తొలగించెను . పిమ్మట శ్రీరాముడు దైన్యము తొలగించుకుని ,"లక్ష్మణా !ఈ వానాకాలము సీతాన్వేషణకు సరిఅయిన సమయము కాదు . సర్డుకాలము వచ్చేది వరకు మనము వేచి వుండెదము . సుగ్రీవుడు పట్టాభిషిక్తుడై ,తన భార్యను తిరిగి పొంది సంతోషముతో ఉండి ఉంటాడు . ఉపకారికి అతడు తప్పక ప్రత్యుపకారము చేస్తాడు . అప్పటి వరకు మనము ఇక్కడే వేచి ఉందాము . "అని పలికెను . 
రామాయణము కిష్కిందకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .