Friday 22 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదిమూడవసర్గ

                                 రామాయణము 

                           కిష్కిందకాండ -ముప్పదిమూడవసర్గ 

అంగదుడు లక్ష్మణుని ఆహ్వానించుటకు ఎదురు వెళ్లెను . అంగదుడు లక్ష్మణుని గౌరవంగా లోనికి ఆహ్వానించెను . అంగదుడు కానీ ,ద్వారపాలకులు కానీ ఇతరులయిన వానర వీరులుకాని ఆయనను సమీపించుటకు ధైర్యము చేయలేక దూరంగానే ఉంటిరి . లక్ష్మణుడు అంగదుడి వెనుక ఏడూ ప్రాకారములు దాటెను . వివిధములగు వానరవీరుల భవనములను దాటుతూ సుగ్రీవుడి ఆంతరంగిక మందిరమునకు చేరెను . అది చాలా వైభవోపేతముగా ఉండెను . అచట అనేకమైన స్త్రీలు కలరు . వారు ఎంతో విలువకల ఆభరణము వడ్డాణములు ధరించి వున్నారు . లోపలినుండి కాళీ అందేలా సవ్వడి విని లక్ష్మణుడు లోపలకు వెళ్ళుటకు సంకోచించి దూరముగా ఒక చోట నిలబడెను . స్త్రీల అందేలా చప్పుడు విన్న లక్ష్మణునికి కోపము రెట్టింపయ్యేను . అంత అతడు కోపముతో ధనుష్టంకారము చేసెను . 
ఆ చప్పుడు విన్న సుగ్రీవుడు ఉలిక్కిపడి ఆసనము పైనుండి లేచెను కానీ లక్ష్మణుని ఎదుటకు వచ్చుటకు ధైర్యము చాలక ,తారను లక్ష్మణుని వద్దకు వెళ్లి ఆయనను శాంతింపచేయమని ,మహాత్ములు స్త్రీలపై కోపము ప్రదర్శించరని పలికి ఆమెను పంపెను . సుగ్రీవుడి ఆజ్ఞపై తార లక్ష్మణుని వద్దకు వచ్చి ,ముందుగా ఆయనను ప్రసన్నుండిని చేసుకొని ,కోపము విడిచి శాంతించమని ప్రార్ధించి ,సుగ్రీవుడి తప్పిదాన్ని క్షమించమని కోరెను . పిమ్మట ఆమె సుగ్రీవుడు సీతాన్వేషణకు పనులు ప్రారంభించెనని లక్ష్మణునితో పలికెను వానరవీరులను కిష్కింధకు రావలిసిందిగా దేశమంతా వర్తమానము సుగ్రీవుడు పంపాడని ,వేలాదిగా కిష్కింధకు వాంతారా వీరులు వచ్చుచున్నారని తెలిపెను . 
అప్పుడు లక్ష్మణుడు కొంత శాంతించెను . ఆమె ఆహ్వానము తో సుగ్రీవుడు వున్నా మందిరంలోకి ప్రవేశించేను . అచట సుగ్రీవుడు పీడా ఆసనంపై సకల ఆభరణములతో దేవేంద్రుని వలే  ఆసీనుడై వున్నాడు . ఆయన చుట్టూ వేలాదిగా స్త్రీలు వున్నారు . అదంతా చూసిన లక్ష్మణుడికి కోపము పెరిగెను . అలా మిక్కిలి కోపముతో ఎర్రబడిన పెద్దపెద్ద కనులతో వున్న లక్ష్మణుని సుగ్రీవుడు చూసేను . 

 రామాయణము కిష్కిందకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

                                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment