Sunday 3 February 2019

రామాయణము కిష్కింద కాండ -ఇరువదితొమ్మిదవసర్గ

                                            రామాయణము 

                                           కిష్కింద కాండ -ఇరువదితొమ్మిదవసర్గ  

కిష్కింధకు రాజు అయిన పిమ్మట సుగ్రీవుడు రాజ్యాకార్యములను పట్టించుకొనక మంత్రులపై కార్యభారములను విడిచి నిత్యమూ భోగలాలసుడై ఉండెను . సమస్త కార్యములు అదుపు తప్పినవి . మంత్రులు రాజ్యభారమును పట్టించుకొనక ఉండెను . సమస్త విషయ సమర్థుడు అయిన హనుమంతుడు ,వర్షాకాలం ముగిసిన పిమ్మట ,శరద్కాలము వచ్చేనని గ్రహించి వెంటనే సుగ్రీవుని వద్దకు వెళ్లి సమయోచితముగా ఇలా మాట్లాడనారంభించెను . 
"పూజ్యుడైన ఓ ప్రభూ !నీకు రాజ్యాధికారం సంప్రాప్తించినది . కీర్తిప్రతిష్టలు అబ్భినవి ,వంశపారంపర్యముగా వచ్చిన సంపదలు వృద్ధి అయినవి . వానర భల్లూకములకు ప్రభువైన ఓ సుగ్రీవా !నీవు పరాక్రమవంతుడవు ,మహా శక్తిమంతుడవు . మహాత్ములైన కోట్లకొలది వానర యోధులు నీ అధీనములో వున్నారు . వారిని ఎంతటి వారైనా ఎదిరించలేరు . నీకు సహాయము చేసిన రామునికి ప్రత్యుపకారము చేయవలసిన సమయము ఆసన్నమయినది . వర్షాకాలం ముగిసినది . శరద్కాలము ఆరంభమయినది సీతాన్వేషణకు ఇదే సరి అయినా సమయము . సీతాన్వేషణకు నీ సైన్యమును నియోగించు మహానుభావుడైన శ్రీరాముడు బలపరాక్రమ సంపన్నుడు దేవతలు సైతము అతనిని ఎదిరించజాలరు . అంతటి మహానుభావుడు నీ సహాయమును ఆశించాడు . తక్షణమే ఆయనకు సహాయము చేయుము . ఆయన చెప్పిన తదుపరి మనము పనులు ప్రారంభించిన కాలయాపన అవుతుంది "అని పలుకగా సుగ్రీవుడు 
తన కర్తవ్యమును సమాలోచించుకుని సైన్యాధిపతి అయిన నీలుని పిలిపించి ఎక్కడెక్కడి వానర వీరులను 15 రోజులలోపు కిష్కింధకు చేరవలసినదిగా ఆజ్ఞ ఇచ్చాడు . అలా 15 రోజులలో రాణి వానరులకు మరణ దండన విధించబడుతుందని చెప్పాడు వానరులకు సమాచారమును చేరవేయు పనిని నీలునికి ,ఆంజనేయునికి అప్పగించాడు . ఆవిధముగా ఆజ్ఞ ఇచ్చి పిమ్మట సుగ్రీవుడు తన అంతఃపురమునకు వెళ్లెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువది తొమ్మిదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు 0,తెలుగు పండితులు . 











No comments:

Post a Comment