Sunday 3 February 2019

                                    రామాయాణం 

                                                          
                                                కిష్కింద కాండ  ఇరువది ఏడోవ సర్గ 
సుగ్రీవుడు కిష్కింధకు పట్టాభిషిక్తుడయ్యెను . వానర వీరుల సంతోష కోలాహలం ఆకాశమును తాకినది . రామలక్ష్మణులు ప్రసవనగిరి అనే పర్వతముపై కల ఒక గుహలో తమ నివాసము ఏర్పరుచుకొనిరి . ఆ ప్రసవనగిరి పరమ రమణీయమైన ప్రదేశము . ఆ ప్రాంతమున స్వచ్ఛమైన జలములకు కానీ ఫల, పుష్పములకు కానికొదువ లేదు . పచ్చని ప్రకృతితో అత్యంత సుందరమగు ప్రదేశము ఆ ప్రసవనగిరి . అంతటి సుందర ప్రదేశములో ఉన్నప్పటికీ రాముని మనస్సు సీత పక్కన లేదనే బాధతో ఎల్లప్పుడూ కలతచెందుతూ వుడేడిది . శ్రీరాముడు అశృనయనములతో ఉండుట చూసిన లక్ష్మణుడు తల్లడిల్లెడివాడు . లక్ష్మణుడు అన్న గారికి ధైర్యము చెప్పి ,ఆయన దైన్యమును తొలగించెను . పిమ్మట శ్రీరాముడు దైన్యము తొలగించుకుని ,"లక్ష్మణా !ఈ వానాకాలము సీతాన్వేషణకు సరిఅయిన సమయము కాదు . సర్డుకాలము వచ్చేది వరకు మనము వేచి వుండెదము . సుగ్రీవుడు పట్టాభిషిక్తుడై ,తన భార్యను తిరిగి పొంది సంతోషముతో ఉండి ఉంటాడు . ఉపకారికి అతడు తప్పక ప్రత్యుపకారము చేస్తాడు . అప్పటి వరకు మనము ఇక్కడే వేచి ఉందాము . "అని పలికెను . 
రామాయణము కిష్కిందకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
                         

No comments:

Post a Comment