Monday 25 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదియేడవసర్గ

                                           రామాయణము 

                                       కిష్కిందకాండ -ముప్పదియేడవసర్గ 

మహాత్ముడగు లక్ష్మణుడు ఇలా పలికిన పిమ్మట సుగ్రీవుడు తన పక్కనే వున్న హనుమంతునితో "హనుమా !మహేంద్రగిరి ,హిమవత్పర్వతము ,వింధ్యాచలము ,కైలాసపర్వతము ,మందరాచలము ఈ అయిదు పర్వతాలపై కల వానరులను ఇక్కడకు తీసుకురావలెను . పడమటి దిక్కున సముద్రతీరమునందు కల పర్వతములపై వున్న వానరులను ,ఉదయగిరినందు కల పద్మాతాళవనము నందు కల వానరులను ,అంజనాద్రి పై వుండు నల్లగా ఏనుగుల వాలే బలిశాముగా కల వానరులను ,మీరు పర్వతముపై కల వానరులను ,దూమ్రగిరిపై కల వానరులను ఇంకనూ ఈ భూమండలముపై కల సంస్థ వానరులను ఇచ్చటికి వెంటనే తీసుకురావలయును . ఆయా వానరులందరిని సామ దాన ఉపాయములతో ఇక్కడకు రప్పించు టకు కొందరు దూతలను పంపుము .    
             ఇంతకూ ముందే నేను కొందరు దూతలను పంపివున్నాను . వారిని తొందరపెట్టి ఇక్కడకు తీసుకు వచ్చుటకు త్వరగా  వెళ్లగల వానరులను దూతలుగా పంపుము . ఈ భూలోకమునందలి సంస్థ వానరులు ఒక 10 దినములలోపల ఇక్కడకు రావాలి . రానివారిని రాజాజ్ఞను దిక్కరించినట్టుగా భావించి శిక్షించెదను . ఇది నా ఆదేశము "అని పలికెను . 
సుగ్రీవుడు ఆ విధముగా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే వానరుల స్థానములు బాగా తెలిసిన దూతలందరూ హనుమంతుడి ప్రేరణచే అన్ని దిక్కులకు వెళ్లెను . అలా వెళ్లిన వానరులు ఈ భూమండలముపై కల వివిధ ప్రదేశములలో ,అరణ్యములలో ,పర్వతములలో కొండగుహలలో ఉన్న వానరులందరిని కిష్కిన్దాకు తరలించెను . వానర ప్రభ్వయినా సుగ్రీవాజ్ఞను వినగానే వానరులందరూ గడగడ వణుకుచూ కిష్కింధకు పయనమయ్యిరి . 
కాటుక వలే నల్లని వారు మిక్కిలి వేగము కలవారు అయిన మూడు కోట్లమంది వానరులు అంజనాద్రి నుండి రాముడు వున్న ప్రదేశమునకు వచ్చిరి . 
మేలిమి బంగారు రంగు కల వారు అస్తాద్రి అందు నివసించు పది కోట్లమంది అచటికి విచ్చేసిరి . సింహము జూలు వంటి వన్నె కలవారు వేయికోట్లమంది కైలాసపర్వతము నుండి వచ్చిరి . 
హిమవత్పర్వతము ను ఆశ్రయించి వున్న ఫలమూలాదులతో జీవించెడివారు వేలకోట్లమంది వచ్చిరి . 
ఎర్రని దేహము కలవారు భయంకర స్వరూపులు ,భీకరమైన చేష్టలు కలవారు అయిన కోట్లకొలది వానరవీరులు కోట్లకొలదిగా వచ్చిరి . 
కొందరు పాలసముద్రము నుండి వచ్చిరి . వారి ఆహారము కొబ్బరి . వారి సంఖ్య లెక్కించలేనిది . వనములనుండి ,నదీ తీరములనుండి ,వానరసేనలు గుంపులు గుంపులుగా సూర్యకాంతులు కప్పివేయుచు మిక్కిలి వేగముగా వచ్చిపడిరి . 
వానరులను తీసువచ్చుటకు వచ్చిన దూతలు వారు వెళ్లిన చోట కల సుగంధ భరితములైన పూవులు ,ఫలములు ,తదితర వస్తువులు కానుకలుగా తీసుకువచ్చి సుగ్రీవునికి ఇచ్చిరి . వచ్చిన వానరులను చూసి సంతుష్టుడై దూతలు తెచ్చిన కానుకలను సంతోషముతో స్వీకరించెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment