రామాయణము
కిష్కిందకాండ -ముప్పదియవసర్గ
సుగ్రీవుడు నీలునికి వానరులను సమీకరించు భాద్యతను అప్పగించి అంతఃపురములోకి ప్రవేశించెను . ప్రసవనగిరిపై శ్రీరాముడు మేఘములు తొలగిపోవుటచే నిర్మలంగా ఉన్న ఆకాశమును చూసి సీతాదేవి ఎడబాటుకు మిక్కిలి శోకపీడితుడయ్యెను . సీతాదేవి కొరకు ఇంకనూ వ్యాకులుడయ్యెను . ఇంతవరకు జానకి జాడ తెలియదయ్యెను ,రావణునిపై దండెత్తుటకు సమయము మించిపోవుచున్నది . అని ఆలోచిస్తూ శ్రీరాముడు శోకములో మునిగిపోయెను . పిదప కొంత సమయము తర్వాత లక్ష్మణుని పిలిచి
"లక్ష్మణా !సుగ్రీవుడు భోగలాలసుడై వర్షాకాలం గడిచినపిదప సీతాన్వేషణ చేయుదునని నాకు ఇచ్చిన ప్రతినను మరచినట్లున్నాడు . తమ్ముడా !సుగ్రీవునితో సమయానుకూలంగా మాట్లాడి ,అతడు మనకు చేసిన ప్రతిమను గుర్తుచేసి ,మన పని ముందుకు సాగునట్లు చేయుము" అని దీనవధానుడై పలికెను . ఈ విధముగా తన అన్న భాదను చూసిన లక్ష్మణుడు సుగ్రీవునిపై మిక్కిలి కోపముతో మండిపడుతూ అతడిని శిక్షించుటకు సిద్దపడెను .
రామాయణము కిష్కింద కాండ ముప్పదియవసర్గ సమాప్తము .
No comments:
Post a Comment