Monday 25 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పది తొమ్మిదవసర్గ

                               రామాయణము 

                                కిష్కిందకాండ -ముప్పది తొమ్మిదవసర్గ 

తన వద్దకు వచ్చిన సుగ్రీవుని  ఇసుక వేస్తె రాలనంతగా వున్నా వానరులను చూసి సంతోషముతో ,ఉత్సాహముతో శ్రీరాముడు సుగ్రీవుని కౌగిలించుకొని ఆయనను పొగిడెను . వారు ఇలా మాట్లాడుకుంటుండగా ఇంకనూ వానర ప్రముఖులు కొందరు వానరులతో అచటికి వచ్చిరి .  అలా వచ్చిన వానర వీరుల వివరములు . 
"శతవాలి "అను వానరవీరుడు పదివేలకోట్లమంది అనుచరులతో అచటికి చేరెను . 
తారకు తండ్రి అయినా సుషేణుడు పెక్కువేలకోట్లమందితో అచటికి వచ్చెను . 
సుగ్రీవునికి మామ అయిన రుమతండ్రి మరి ఒక వేయి కోట్ల మందితో అచటికి వచ్చెను . 
హనుమంతుడి తండ్రి అగు కేసరి వేలకొలది వానరులతో అచటికి  వచ్చెను . 
గవాక్షుడు అను వాడు వేలకోట్ల మందితో అచటికి వచ్చెను . 
మహాకాయుడు అయిన నీలుడు పదికోట్లమందితో అచటికి వచ్చెను . 
గవయుడు అను వానర సేనా నాయకుడు అయిదు కోట్లమంది తో అచటికి చేరెను . 
దరీముఖుడు అను వానర నాయకుడు వేయి కోట్ల మందితో అచటికి చేరెను . 
అశ్వనీ దేవతలా కుమారులైన మైందుడు ,ద్వివిదుడు అనువారు చేరిఒక వేయి కోట్ల మంది అనుచరులతో అచటికి చేరిరి . 
గజుడు అను మహాశక్తివంతుడైన వానరవీరుడు మూడు కోట్లమందితో అచటికి చేరెను . 
భల్లూక ప్రభువైన జాంబవంతుడు పదికోట్లమంది భల్లూక యోధులతో అచటికి చేరెను . 
రుమన్వంతుడు  అను వానర ప్రముఖుడు వందకోట్లమంది అనుచరులను వెంట పెట్టుకుని అచటికి వచ్చెను . 
గంధమాధనుడు అనువాడు కోటానుకోట్ల మందిని వెంటపెట్టుకుని అచటికి వచ్చెను . 
యువరాజైన అంగదుడు నూరు శంకువులు సంఖ్యలో వానరులను వెంటపెట్టుకుని అచటికి వచ్చెను . 
తారుడు అను వాడు అయిదు కోట్ల మంది వానరులతో అచటికి వచ్చెను . 
ఇంద్రజానువు అనువాడు పదకొండు కోట్ల మంది వానరులతో అచటికి వచ్చెను . 
రంభుడు అనువాడు కోట్లకొలది వానర వీరులతో అచటికి చేరెను . 
దుర్ముఖుడు అనువాడు రెండు కోట్లమందితో అచటికి వచ్చెను . 
హనుమంతుడు వెయ్యికోట్ల మంది బలిష్ఠులైన అనుచరులతో వచ్చెను . 
నలుడు వృక్షములపై నివసించు కోట్లకొలది వానరులతో అచటికి వచ్చెను .
 శుభలక్షణ సంపన్నుడైన దధిముఖుడు పదికోట్లమంది వానరులతో అచటికి వచ్చెను . 
శరభుడు ,కుముదుడు ,వహ్ని ,రంహుడు ఇంకా కొంత మంది కామరూపులైన వానరులు పర్వతాలతో ,వనాలతో కూడిన సంస్థ భూమండలమును గాలించి అసంఖ్యాకులైన వానరులను తీసుకుని వచ్చిరి . 

వారంద్రూ కేరింతలతో కోలాహలంతో తమ రాకను వానర ప్రభువైన సుగ్రీవునికి తెలిపి సుగ్రీవుని ఎదుట వినమ్రతతో నిలబడిరి . ఆ సమయములో సుగ్రీవుడు శ్రీరాముని కి నస్కారము చేసి అచటకు వచ్చిన వానర వీరుల గురించి ఆయనకు తెలిపెను . పిమ్మట వానర వీరులతో" వీరులారా !పర్వతములో ,వృక్షముల వద్ద సేద తీరనుంది ఆయా నాయకులు తమ అనుసరులను చూసుకోండి "అని పలికెను . 

రామాయణము కిష్కింద కాండ ముప్పది తొమ్మిదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ) , తెలుగు పండితులు 






No comments:

Post a Comment