రామాయణము
కిష్కిందకాండ -ముప్పదిఆరవసర్గ
ఆవిధముగా తారామ మాటలకు శాంతించిన లక్ష్మణుని చూసి ధైర్యమును తెచ్చుకున్న సుగ్రీవుడు లక్ష్మణునితో "ఓ మహానుభావా !శ్రీరాముడు మహా వీరుడు ,పరాక్రమవంతుడు ,ఏడుమద్దిచెట్లను ,పర్వతమును ,భూమిని తన బాణములతో చీల్చగల రాముడికి ఎవరి సహాయము అవసరము లేదు అది నిమిత్త మాత్రమూ మాత్రమే . ఆ సదవకాశము నాకు కలుగుట నా అదృష్టము . నేను తప్పక శ్రీరాముని వెనక వుంటాను . శ్రీ రాముని పై కల విశ్వాసము వలన కానీ ,చనువుతో కానీ నేనేమయినా హద్దుమీరి ప్రవర్తించినట్లయితే నన్ను క్షమించుము . "అని పలికెను .
ఆ మాటలు విన్న లక్ష్మణుడు ప్రేమతో "సుగ్రీవా !తప్పులు చేయుట జీవుల సహజము కానీ ఆ తప్పులను అంగీకరించి క్షమాపణ అడుగుతా మాత్రము అందరికి సాధ్యము కానీ విషయము . ఆ విషయమున నీవు కృతకృత్యుడవు . ఓ వానరరాజా !సోకనిమగ్నుడై ఉన్న శ్రీరాముని పలుకులు విని నేను మిక్కిలి వ్యధ చెందితిని . ఆ వేదన కారణముగా నేను కోపములో నిన్ను నా పరుష మాటలతో బాధించాను . నన్ను క్షమించుము . నీవు వేణు వెంటనే బయలుదేరి నీ మిత్రుడి వద్దకు వచ్చి ఆయనను ఓదార్చుము "అని పలికెను .
రామాయణము కిష్కిందకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment