రామాయణము
కిష్కిందకాండ -ముప్పదిరెండవసర్గ
మత్తు నుండి బయటకు వచ్చిన సుగ్రీవుడు లక్ష్మణుడు కోపముగా వచ్చినట్లు మంత్రులవలన తెలుసుకుని బయపడసాగెను . ఏమిచేయాలో తోచక తన మంత్రులతో "ఓ మంత్రులారా !లక్ష్మణుడు అంత కోపముగా ఉండుటకు కారణము ఏమయి ఉండును . నేను ఆయనకు ఏమియు అపరాధము చేయలేదు కదా ! ఇంతకూ మునుపు నేను ఎప్పుడు ఆ మహానుభావునితో కనీసము పరుషముగానైనా మాట్లాడివుండలేదు . ఆయన కోపము శాంతించు ఉపాయము ఏదయినను చెప్పండి "అని పలికెను .
ఆ మాటలు విన్న మంత్రులు "ఓ వానర రాజా !లక్ష్మణుడు మీరు సీతాదేవి అన్వేషణకు ఏ ప్రయత్నము చేయుట లేదని కోపముగా వుండి ఉండవచ్చు . రామలక్ష్మణులు బలపరాక్రములు ,మహానుభావులు వారు నీకు మహోపకారం చేసినారు . లోకోపవాదమును గూర్చి ఏమాత్రము ఆలోచించక నీ అన్నాను చంపి నీ భార్యను నీ రాజ్యమును నీకు అప్పగించారు . అట్టి వారితో విరోధము తగదు . వారు చేసిన ఉపకారమునకు బదులుగా నీవు వారికి సహాయము చేయవలెను అది నీ బాధ్యత . ప్రస్తుతము నీవు బందు మిత్రులతో సహా లక్ష్మణుని శరణు కొరుము ,ఆయనను ప్రసన్నుడిని చేసికొనుము . ఆయన పరుషముగా మాట్లాడినను పల్లెత్తు మాట మాట్లాడక భరించుము "అని పలికెను .
రామాయణము కిష్కింద కాండ ముప్పదిఏందవాసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment